రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పెట్టి భారీ బడ్జెట్ ఈ మూవీ లలో హీరో గా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే . దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కుతున్న బాహుబలి మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్న ప్రభాస్ అప్పటి నుండి భారీ బడ్జెట్ మూవీ లలో అంతకుమించిన మూవీ లలో మాత్రమే నటిస్తు వస్తున్న విషయం మనకు తెలిసిందే .

అందులో భాగంగా ఇప్పటికే ప్రభాస్ సాహో , రాధే శ్యామ్ మూవీ లలో హీరో గా నటించాడు. ప్రస్తుతం కూడా ప్రభాస్ సలార్ , ఆది పురుష్ ,  ప్రాజెక్ట్ కే వంటి భారీ బడ్జెట్ మూవీ లలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూడు మూవీ లలో ఇప్పటికే ప్రభాస్ ఆది పురుష్ మూవీ షూటింగ్ ని పూర్తి చేసుకున్నాడు.  ప్రభాస్ ప్రస్తుతం సలార్ మరియు ప్రాజెక్ట్ కే సినిమా షూటింగ్ లలో పాల్గొంటూ వస్తున్నాడు. ఆది పురుష్ మూవీ కి హిందీ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తుండగా , సలార్ మూవీ కి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రాజెక్ట్ కే మూవీ కి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ మరో బాలీవుడ్ క్రేజీ దర్శకుడితో మూవీ చేయబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు విషయం లోకి వెళితే ... బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ప్రభాస్ ఒక యాక్షన్ ట్రైలర్ మూవీ లో నటించబోతున్నట్లు, ఆ మూవీ వచ్చే సంవత్సరం జూన్ లో ప్రారంభం కానున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: