ఇటీవల టాలీవుడ్ యంగ్ హీరో  విజయ్ దేవరకొండ లైగర్ సినిమాలో నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక లైగర్ సినిమాతో డిజాస్టర్ అందుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన తదుపరి సినిమాల మీద దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా వరంగల్ శ్రీను ఈ సినిమా ఫలితం మీద విజయ్ దేవరకొండ ఆటిట్యూడ్ మీద పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.ఇక  ఒక ఆంగ్ల పత్రికతో ముచ్చటించిన ఆయన ఈ సినిమా గురించి అనేక విషయాలు వెల్లడించారు.ఇకపోతే  లైగర్ సినిమా విషయంలో విజయ్ దేవరకొండ అతి నమ్మకంతో ఉన్నాడో లేదో తాను చెప్పలేనని పేర్కొన్న వరంగల్ శీను ఈ సినిమా ఆడియన్స్ కి ఖచ్చితంగా నచ్చుతుందని విజయ్ దేవరకొండ అనుకున్నాడని కానీ రిజల్ట్ చూసి చాలా నిరాశ చెందాడని చెప్పుకొచ్చారు.

ఇక బాయ్ కాట్ ట్రెండ్ వల్ల సినిమాకు మరింత నెగటివ్ టాక్ వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా ఈ సినిమా వల్ల తాను పెట్టిన పెట్టుబడిలో 65% నష్టపోయానని వెల్లడించారు.అంతేకాదు  కొంతమంది కావాలని నటీనటులు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లను టార్గెట్ చేస్తూ బాయ్ కాట్ ట్రెండ్ సృష్టించడమే గాక సినిమా దారుణంగా ఉందంటూ నెగిటివ్ రివ్యూ స్ప్రెడ్ చేస్తున్నారని వరంగల్ శీను పేర్కొన్నారు.ఇదిలావుంటే ఇప్పుడు అసలే సినీ పరిశ్రమ గడ్డుకాలం ఎదుర్కొంటుందని, ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో సినిమాలను బ్యాన్ చేయాలి బాయ్ కాట్ చేయాలి అంటూ రెండు చేస్తే పరిశ్రమకు మరింత ఇబ్బంది ఏర్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

కాగా ఈ  సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా నచ్చకపోతే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయవచ్చు కానీ ఈ సినిమా విడుదలకు ముందే బాయ్ కాట్ చేయాలని, విడుదల కాకముందే సినిమా దారుణంగా ఉన్నట్లు టాక్ తెప్పించడం కరెక్ట్ కాదని అన్నారు.అయితే ఈ ఏడాది వరంగల్ శీనుకు అసలు ఏమీ కలిసి రాలేదు. ఇక నైజాం ప్రాంతంలో దిల్ రాజుకు పోటీగా ఎదుగుతున్న ఆయన ఆచార్య సినిమా నైజాం రైట్స్ కొనుక్కున్నారు.కాగా  ఆ సినిమా దారుణమైన ఫలితాన్ని అందించింది.అయితే  తర్వాత విరాటపర్వం సినిమా కూడా దారుణమైన ఫలితాన్ని అందుకోవడంతో ఆ సినిమా విషయంలో కూడా నష్టపోయాడు. ఇదిలావుంటే ఇప్పుడు లైగర్ సినిమాతో మరిన్ని నష్టాలు అందుకున్నాడు ఈ ఏడాది మొత్తం మీద 100 కోట్ల రూపాయల దాకా వరంగల్ శీను నష్టపోయినట్లు అంచనా. ఇకపోతే.గతంలో వరంగల్ శీను హుషారు, కబాలి, ఇస్మార్ట్ శంకర్, గద్దల కొండ గణేష్, నాంది, క్రాక్ లాంటి సినిమాలతో లాభాలు అందుకున్నాడు సంగతి తెలిసిందే..!!

మరింత సమాచారం తెలుసుకోండి: