అక్కినేని నాగార్జున హీరోగా గోస్ట్ అనే యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమా రూపొందుతున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దసరా కానుకగా ఈ సినిమా విడుదల కాబోతుంది అని వార్తలు వస్తున్న నేపథ్యంలో త్వరలోనే విడుదల తేదీని కూడా ప్రకటించాలని అక్కినేని అభిమానులు కోరుకుంటున్నారు.

బంగార్రాజు సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన నాగార్జున ఆ తర్వాత చేస్తున్న ఈ చిత్రంపై సహజంగానే అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. సయామీ కేర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా టెర్రరిజం బ్యాక్ గ్రౌండ్ లో రూపొందుతుంది అని తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో ఇప్పుడు అక్కినేని నాగచైతన్య చేయబోయే తదుపరి సినిమాకు సంబంధించిన పనులు మొదలవుతున్నాయనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే త్వరలోనే నాగార్జున తన వందో సినిమా మైలురాయికి చేరుకోవడం ఆయన అభిమానులను ఎంతగానో సంతోష పరుస్తుంది. 

ఆ విధంగా ఈ 100వ సినిమాను ఏ దర్శకుడు తో చేస్తాడు అన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంది. అంతేకాదు ఏ జోనర్ లో ఆ సినిమా చేస్తాడు అన్న ఆసక్తి కూడా అక్కినేని అభిమానులలో ఉంది. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం అక్కినేని నాగచైతన్య తన వందవ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడట. దాని కోసం అగ్ర దర్శకులతో మాట్లాడుతున్నాడట. ఇప్పటికే కొంతమంది సీనియర్ హీరోలు తమ వందవ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని భారీ స్థాయిలో ఆ సినిమాలతో విజయాలను అందుకున్నారు. వారిలాగానే అక్కినేని నాగార్జున కూడా ఈ సినిమాను ఏ స్థాయిలో చేసి విజయం అందుకుంటాడో చూడాలి. ఇప్పుడు ఈ సినిమా ను చేయడానికి కొంతమంది అగ్ర దర్శకులు లైన్ లో ఉన్నారు. ఇంకా ఇతర భాషల సినిమాల దర్శకులు కూడా అయన తో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: