ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల చేసేందుకు చిత్ర బృందం పలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నది.అభిమానులు కూడా ఈ చిత్రం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ గౌతమ్ తిన్నానూరి డైరెక్షన్లో ఒక సినిమా చేయబోతున్నట్లుగా గతంలో వార్తలు వినిపించాయి. అయితే ప్రస్తుతం రామ్ చరణ్ పాన్ ఇండియా హీరోగా ఉండడంతో అలాంటి రిస్క్ తీసుకుంటారా లేదా అనే సందేహాలు అభిమానులలో కలుగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో తాజాగా మరొక కొత్త దర్శకుడు పేరు తెరపైకి రావడం జరుగుతోంది. ఆ డైరెక్టర్ ఎవరో కాదు యువ హీరో సుజిత్.
ఇప్పుడు యువ డైరెక్టర్ రామ్ చరణ్ కోసం ఒక అదిరిపోయే కథను సిద్ధం చేశారని ఇండస్ట్రీలో టాప్ వినిపిస్తోంది రామ్ చరణ్ దృష్టిలో పెట్టుకొని బాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమా తరహా( ధూమ్ ) సినిమా తరహాలో ఒక కథను సిద్ధం చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా కథ ఒక లైన్ ని రామ్ చరణ్ కు వినిపించినట్లు సమాచారం. ఆ లైన్ నచ్చడంతో స్క్రిప్టున సిద్ధం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. రన్ రాజా రన్ సినిమాతో సుజిత్ డైరెక్టర్గా మారారు ఆ తర్వాత సాహో సినిమా తెరకెక్కించిన అంచనాలను అందుకోలేకపోయింది. మరి రామ్ చరణ్ తో సినిమా అవకాశం సంపాదించడం మరి ఈ సినిమా పై క్లారిటీ ఇస్తే బాగుంటుంది.