బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దర్శకుడు యస్‌యస్. రాజమౌళి 'ఆర్ఆర్ఆర్'తో ఆ క్రేజ్ మరింత పెరిగిపోయింది.

అతడి సినిమాలకు అందరు ఫిదా అయ్యారు. ఈ నేపథ్యంలో రాజమౌళి వచ్చే చిత్రం ఏంటా అని అందరు ఎదురు చూస్తున్నారు. జోనర్‌ ఏంటా అని చర్చించుకోవడం ప్రారంభించారు. టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు తో సినిమా చేయనున్నట్టు రాజమౌళి గతంలోనే ప్రకటించాడు.

ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసకుడి కథ అని మూవీ నేపథ్యాన్ని వివరించాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో ఇప్పటికే హీరోయిన్ ఫిక్సయిందని పుకార్లు షికార్లు కొడుతన్నాయి. రాజమౌళి సినిమాలో బాలీవుడ్ నటి దీపికా పదుకొణె కథానాయికి గా ఎంపికయిందని సమాచారం.

మేకర్స్ ఆమెతో సంప్రదింపులు జరపగా ఆసక్తి చూపించినట్టు వార్తలు వెలువడుతున్నాయి. కానీ, కాంట్రాక్ట్‌పై సంతకం చేయలేదని తెలుస్తోంది. రాజమౌళి దర్శకత్వం వహించిన 'ఆర్ఆర్ఆర్'కు విదేశీ ప్రేక్షకులు కూడా సర్‌ప్రైజ్ అయ్యారు. అందువల్ల మహేశ్‌తో తెరకెక్కించే సినిమాను తెలుగు, ఇంగ్లీష్‌లో ఒకేసారి రూపొందించనున్నట్టు టాక్ హల్‌చల్ చేస్తుది తామిద్దరం కలసి పనిచేయనున్నట్టు రాజమౌళి మహేశ్ పదేళ్ల క్రితమే ప్రకటించారు.

ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో కెఎల్. నారాయణ నిర్మించనున్నాడు. 'ఆర్ఆర్ఆర్'భారీ విజయం సాధించడంతో పలు దేశాలు రాజమౌళిని ఆహ్వానిస్తున్నాయి. సినిమాల గురించి మాట్లాడాలని కోరుతున్నాయి.

తాజాగా అతడు 'టోరెంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌'లో పాల్గొన్నాడు. మహేశ్‌తో సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించాలనుకుంటున్నానని వివరించాడు. రాజమౌళితో సినిమా చేయబోతుండటంతో తన సంతోషాన్ని మహేశ్ బాబు గతంలోనే తెలిపాడు. ''రాజమౌళి గారితో ఒక్క సినిమాకు పనిచేస్తే 25 చిత్రాలకు పనిచేసినట్లే.

ఈ మూవీలోని పాత్ర కోసం శ్రమించాలి. ఎందుకంటే సినిమా దానిని డిమాండ్ చేస్తుంది. చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. పాన్ ఇండియాగా తెరకెక్కుతుంది. ఈ సినిమా ప్రేక్షకులందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను''అని మహేశ్ బాబు చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: