పాన్ ఇండియా టాప్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి ఇంకా అలాగే సూపర్ స్టార్ మహేశ్ బాబు కలయికలో వస్తున్న సినిమా గురించి మరో ఆసక్తికర వార్త వినిపిస్తోంది. ఇటీవల రాజమౌళి తన తర్వాతి సినిమాపై ఓ అప్డేట్ ఇచ్చారు.తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్, షూటింగ్కు సంబంధించి సోషల్ మీడియాలో కొత్త కథనాలు ప్రచారం అవుతున్నాయి."ఆర్ఆర్ఆర్"తో భారీ విజయాన్ని అందుకున్న రాజమౌళి.. మహేష్ బాబుతో సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. ఇటీవలే దానికి సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా విడుదలకు అవకాశం ఉన్న ఈ సినిమా.. భారీ స్థాయిలో రూపొందిస్తున్నట్టు సమాచారం. ప్రపంచాన్ని చుట్టే ఓ సాహసికుడి చుట్టూ సినిమా ఉండబోతుందని రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి తాజాగా మరిన్ని ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి.బాహుబలి సినిమాతో దేశావ్యాప్తంగా ఇంకా ఆర్ఆర్ఆర్ సినిమాతో హాలీవుడ్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు రాజమౌళి.ఆర్ఆర్ఆర్ చిత్రానికి హాలీవుడ్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఈ నేపథ్యంలో తన తర్వాతి ప్రాజెక్టును గ్లోబల్ లెవెల్లో తీర్చిదిద్దే అవకాశం ఉందని సమాచారం. మహేశ్తో తీసే చిత్రాన్ని తెలుగుతో పాటు ఇంగ్లిష్లోనూ ఏకకాలంలో షూటింగ్ చేస్తారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.


దసరాలోగా పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టి.. వచ్చే ఏడాది సమ్మర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ చేయనున్నారని తెలుస్తోంది. 2024 సమ్మర్ కానుకగా సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.ఈ సినిమాకు సంబంధించి మరో అప్డేట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాకు ఇంతవరకు హీరోయిన్ ఎంపిక చేయలేదు. అయితే బాలీవుడ్ భామ దీపికా పదుకొనేను ఎంపిక చేసినట్లు సోషల్ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. దీపిక ఇదివరకే 'ఎక్స్ఎక్స్ఎక్స్: ది రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్' అనే హాలీవుడ్ చిత్రంలో నటించింది. దీంతో ఆమె సినిమాలో ఉండటం కొంత హెల్ప్ అవుతుందని చిత్ర యూనిట్.. దీపికను ఎంపిక చేసినట్లు సమాచారం. ప్రస్తుతం మహేశ్ బాబు.. త్రివిక్రమ్ సినిమాలో బిజీగా ఉన్నారు. ఆ చిత్ర షూటింగ్ అయిపోయిన వెంటనే.. ఈ షూటింగ్లో పాల్గొననున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌ కథ అందిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: