ఒకప్పుడు టాలీవుడ్ లో క్రేజీ యంగ్ హీరోలలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరో తరుణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఈయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇకపోతే ఆ తర్వాత అన్ని వరుస ఫ్లాప్ లు రావడంతో ఇండస్ట్రీ నుంచి దూరం అయిపోయాడు అని చెప్పవచ్చు. ఇక ఫిలిం బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగ లేకపోయాడు. తరుణ్ తల్లి రోజా రమణి ప్రముఖ హీరోయిన్ అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఏ రోజు కూడా తల్లి ఇన్ఫ్లుయన్స్ ను తరుణ్ ఉపయోగించుకోలేదు.
అయితే ఇప్పుడు మళ్లీ ఆయన రీఎంట్రీ కి సిద్ధమవుతున్నాడు అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇన్ని రోజులు తెరమరుగైన తరుణ్ మళ్లీ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని తెలియడంతో ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అది కూడా మహేష్ బాబు సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు అని తెలిసి అటు మహేష్ అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేయడం గమనార్హం. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ కాంబినేషన్లో తన 28వ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ద్వారా తరుణ్ తన రీ ఎంట్రీ ని ఇవ్వబోతున్నాడు అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇకపోతే అరవింద సమేత, అలవైకుంటపురం సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందుకున్న త్రివిక్రమ్ తో మహేష్ బాబు చేస్తున్నా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుంది అని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి త్రివిక్రమ్ కు ఒక అలవాటు ఉంది .. తాను చేస్తున్న సినిమాలన్నింటిలో కూడా మెయిన్ హీరోతో పాటు సెకండ్ హీరోని కూడా తీసుకుంటున్నాడు. సెకండ్ హీరోయిన్ లను కూడా తీసుకుంటున్నాడు. అలవైకుంఠపురం సినిమాల్లో సుశాంత్ తో పాటు నివేదా పేతురాజ్ ను తీసుకున్నాడు. అలాగే ఈసారి మహేష్ తో చేయబోయే సినిమాలో తరుణ్ తో పాటు మరొక సీనియర్ హీరోయిన్ ను కూడా తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి మహేష్ బాబు సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న తరుణ్ ఇలా అయినా తన కెరీర్ ను మార్చుకుంటాడో లేదో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: