ఆది పురుష్ సినిమా ఇప్పటికే విడుదలకు సిద్ధం కాగా, మరొకటి సలార్. ఈ రెండు సినిమాల షూటింగ్ లు దాదాపుగా పూర్తయ్యాయి. ప్రస్తుతం ‘ప్రాజెక్ట్-K’ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ‘మహానటి’ ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతుంది. అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర లో నటిస్తూ ఉండగా, దీపికా పడుకొనే హీరోయిన్ నటిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బ్రేక్ లు వేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఇతర సినిమాల షూటింగ్ ల కోసం ప్రభాస్ ఈ సినిమా ను వాయిదా వేశాడు.
ఇప్పుడు అది పురుష్ సినిమా ప్రమోషన్స్ కోసం, అలాగే సలార్ సినిమా షూటింగ్ కోసం ఈ సినిమా ను పక్కన పెట్టబోతున్నాడట. సై-ఫై జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫ్యూచర్ గురించి ఉంటుందని, వరల్డ్ వార్-3 టైమ్ లైన్లో ఈ సినిమా జరుగుతుందని తెలుస్తుంది. ఏదేమైనా ఈ మూడు భారీ పాన్ ఇండియా సినిమా లతో తప్పకుండా ఈ హీరో భారీ విజయం అందుకోవడం ఖాయం అని చెప్పొచ్చు. ఇకపోతే ఆది పురుష్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంటే సలార్ సెప్టెంబర్ లో విడుదల అవుతుంది. మధ్యలో మారుతీ సినిమా ను చేసి విడుదల చేయాలనీ భావిస్తున్నాడు. ఆ తర్వాత 2024 లో ప్రాజెక్ట్ కే సినిమా ను విడుదల చేస్తారట.