ఇక ఇటీవలే ఈయన నటించిన 'అశోక వనంలో అర్జున కళ్యాణం' విడుదలై మంచి విజయం సాధించింది. ప్రస్తుతం విశ్వక్ మూడు సినిమాలను సెట్స్పై ఉంచాడు.
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తున్నాడు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా పలు విభాగాల్లో పనిచేస్తూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇటీవలే ఈయన నటించిన 'అశోక వనంలో అర్జున కళ్యాణం' విడుదలై మంచి విజయం సాధించింది. ప్రస్తుతం విశ్వక్ మూడు సినిమాలను సెట్స్పై ఉంచాడు. అందులో 'ఓరి దేవుడా' ఒకటి. తమిళంలో సూపర్ హిట్టయిన 'ఓమై కడువలే' చిత్రానికి రీమేక్గా ఈ మూవీ తెరకెక్కింది.
ఒరిజనల్ వెర్షన్ను తెరకెక్కించిన అశ్వత్ మరిముత్తు రీమేక్ చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తున్నాడు. వెంకటేష్ ఈ మూవీలో కీలకపాత్రలో నటిస్తున్నాడు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 21న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుసగా అప్డేట్లను ప్రకటిస్తుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు.
చిన్నప్పటి నుండి స్నేహితులుగా ఉన్న హీరో హీరోయిన్లు పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. అయితే పెళ్ళి తర్వాత కొన్నాళ్ళకే అపార్థాల కారణంగా వీరిద్దరూ విడిపోవాలని కోర్టు మెట్లు ఎక్కుతారు.
అయితే వీళ్ళు విడిపోవడానికి కారణాలు ఏంటీ? వీళ్ళ సమస్యను దేవుడు ఎలా పరిష్కరించాడు? అనే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. లైఫ్ మనకు ఇంకొక చాన్స్ ఇస్తే.. గతంలో మనం తీసుకున్న నిర్ణయాలను మార్చితే జీవితం ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్తో దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఈ చిత్రంలో దేవుడి పాత్రలో వెంకటేష్ కనిపించనున్నాడు. ట్రైలర్ చివర్లో వైఫ్లో ఫ్రెండ్ను చూడొచ్చు సార్.. కానీ ఫ్రెండ్ వైఫ్లా వచ్చిందనుకో అంటూ వెంకటేష్కు చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ట్రైలర్తోనే చిత్రబృందం సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేసింది.
ఈ చిత్రంలో విశ్వక్కు జోడీగా మిథిలా పాల్కర్ హీరోయిన్గా నటించింది. వీళ్ళ పేయిర్ ఆన్ స్క్రీన్లో చక్కగా ఉంది. లియన్ జేమ్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పీవిపీ సినిమాస్, శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.