సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తరికేకుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో అతడు , ఖలేజా మూవీ లు తెరకెక్కయి. ఇది వీరిద్దరి కాంబినేషన్ లో మూడవ సినిమా. ఈ మూవీ మహేష్ బాబు కెరియర్ లో 28 వ మూవీ గా తెరకెక్కుతుంది. ఇది ఇలా ఉంటే మహేష్ బాబు సరసన ఈ మూవీ లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. మహేష్ బాబు , పూజ హెగ్డే కలిసి ఇది వరకు మహర్షి మూవీ లో కలిసి నటించారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇది రెండవ సినిమా. ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయింది.

యాక్షన్ సన్నివేశాలతో ఈ సినిమా షూటింగ్ ని మూవీ యూనిట్ ప్రారంభించింది. అలాగే ఈ మూవీ మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి అయింది. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ రెండవ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఈ రెండవ షెడ్యూల్ షూటింగ్ లో పూజా హెగ్డే కూడా ఈ మూవీ లో పాల్గొనబోతోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ లో మహేష్ బాబు మరియు పూజా హెగ్డే పాత్రలు ఇవే అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మూవీ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా కనిపించబోతున్నట్లు ,  అలాగే పూజా హెగ్డేమూవీ లో ఎలాంటి జాబు లేకుండా ఖాళీగా ఉండే అమ్మాయి పాత్రలో కనిపించ బోతున్నట్లుట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అందించనున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సమ్మర్ కానుకగా ఏప్రిల్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: