అల్లు అర్జున్ నటించిన భారీ యాక్షన్ చిత్రం పుష్ప.. ఈ చిత్రంతో సుకుమార్, రష్మిక ,సమంత, అల్లు అర్జున్ తదితర నటి నటుల సైతం మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇక ఈ చిత్రంలో సమంత స్పెషల్ సాంగ్లో నటించి మంచి మార్కులు సంపాదించుకుంది. దీంతో విదేశాలలో కూడా ఈమె పాట బాగా పాపులర్ అయింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ఖుషి సినిమాలో నటిస్తున్నది. ఇక ఈ చిత్రంలోని కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించిన తర్వాత ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది.


అంతేకాకుండా రీసెంట్గా సమంత స్కిన్ ఎలర్జీ సమస్యలతో బాధపడుతుందని ట్రీట్మెంట్ కోసం విదేశాలకు వెళ్లిందని వార్తలు బాగా వైరల్ గా మారుతున్నాయి.ఈ వార్తలపై సమంత టీమ్స్ స్పందించి తనకు ఎలాంటి ఆరోగ్యకరమైన సమస్యలు లేవనే విషయాన్ని తెలియజేసింది. అయితే సమంత ఎందుకు అమెరికాకు వెళ్ళింది అనే విషయం మాత్రం ఇంకా ఇప్పటికి క్లారిటీగా రాలేదు. ఇదంతా ఇలా ఉండగా యూఎస్ టూర్ ముగించుకున్న సమంత తిరిగి హైదరాబాదుకు చేరుకొని ఫ్యామిలీ మెన్ -2 సిరీస్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజు అండ్ డీకే లతో కలిసి మరొక వ్యక్తి న్యూస్ లో నటించబోతున్నట్లు సమాచారం .


దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే ప్రస్తుతం సీటాడెల్ అనే పేరుతో ఒక వెబ్ సిరీస్ ని తెరకెక్కించబోతున్నారు ఇందులో వరుణ్ ధావన్ తో కలిసి సమంత కీలకమైన పాత్రలో కనిపించబోతున్నది ఈ సినిమా కోసం సమంత అప్పుడే తన ప్రిపరేషన్లను కూడా మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ఈ ఏడాది డిసెంబర్లో మొదలుపెట్టనున్నట్లు సమాచారం. ఇక అలాగే విజయ్ దేవరకొండ తో చేస్తున్న ఖుషి తాజా షెడ్యూల్ ని కూడా ప్రారంభించి అందులోని కీలకమైన సన్నివేశాలలో పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఇదంతా ఇలా ఉండగా సమంత నటించిన యశోద, శాకుంతలం సినిమాలు త్వరలోనే విడుదల కాబోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: