ఈ నేపథ్యంలోనే ఇదే జోడితో డైరెక్టర్ విమల్ కృష్ణ ఈ సినిమా సీక్వెల్ ను యధావిధిగా తెరకెక్కిస్తారని అందరూ భావించారు. అయితే ఈ సినిమా సీక్వెల్ కోసం కేవలం హీరోని మాత్రమే రిపీట్ చేస్తున్నారు కానీ హీరోయిన్ విషయంలో కాస్త చేంజ్ చేయబోతున్నట్లు సమాచారం. అందుచేతనే నేహా కి ఆ అవకాశం ఇవ్వకుండా ఇతర హీరోయిన్ కి అవకాశం ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఇటీవల సిద్దు ఒక ఈవెంట్లో కన్ఫర్మ్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
అంతేకాకుండా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా ఎంపిక అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. తాజాగా సిద్దు ఇన్స్టాగ్రామ్ నుంచి ఒక పోస్ట్ రావడం జరిగింది. అందులో అనుపమ ఫోటోని తన స్టోరీస్ లో పోస్ట్ చేసి ఇలా రాసుకోచ్చారు. నైస్ టీ షర్ట్ అను.. అంటూ ఒక క్యాప్షన్ తెలియజేశారు. టీ షర్టు మీద అట్లుంటుంది మనతోని సినిమాలోని ఫేమస్ డైలాగ్ రాసుకొచ్చారు దీంతో డీజే టిల్లు -2 సినిమాలో ఈ ముద్దుగుమ్మని హీరోయిన్గా లాక్ చేశారని అభిమానులు భావిస్తూ ఉన్నారు. మరి కొంతమంది అనుపమ కన్నా హీరోయిన్ నేహా శెట్టి ని ఆపాత్రకు తగిన న్యాయం చేయగలదని భావిస్తున్నారు.