మహేష్-రాజమౌళి సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు.. సైలెంట్గా మైండ్ బ్లోయింగ్ ప్లాన్ చేస్తున్న జక్కన్న...?
బాహుబలి`, `ఆర్ఆర్ఆర్`తో తన సత్తాని చాటుకున్నారు రాజమౌళి. తనది గ్లోబర్ మార్కెట్ స్థాయి అనే విషయాన్ని తెలియజేశారు. ఇప్పుడు నెక్ట్స్ మహేష్బాబు తో చేయబోయే సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ఉంటుందని భోగట్టా. ఆ దిశగానే బడ్జెట్, కాస్టింగ్, టెక్నిషియన్లని ప్లాన్ చేస్తున్నారని రాజమౌళి. అంతర్జాతీయ మార్కెట్ని టార్గెట్ చేస్తూ మహేష్ సినిమాతో రంగంలోకి దిగబోతున్నారట.
ఇదిలా ఉంటే 29లో కాస్టింగ్కి సంబంధించిన అనేక వార్తలు వినిపిస్తున్నాయి. విలన్ పాత్రల కోసం స్టార్ హీరోలు నటించబోతున్నారనే ప్రచారం చాలా రోజులుగా వినిపిస్తుంది. కొన్ని రోజులు బాలయ్య పేరు, మరికొన్న రోజులు కమల్ హాసన్ పేరు వినిపించింది. బాలీవుడ్ స్టార్ల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ అవన్నీ రూమర్స్ గానే మిగిలిపోయాయి. తాజాగా మరికొందరు స్టార్ల పేర్లు తెరపైకి రావడం విశేషం.
ఈ సినిమాకి అంతర్జాతీయ టెక్నీషియన్లు పనిచేస్తారనే ప్రచారం జరుగుతుంది. అయితే ఇద్దరు ఇండియన్ స్టార్లని తీసుకోవాలనుకంటున్నారట రాజమౌళి. తమిళం నుంచి కార్తి పేరు వినిపిస్తుంది. ఇటీవలే రాజమౌళి.. కార్తిని కలిసి ఇందులోని పాత్ర గురించి చెప్పారట. అందుకు కార్తి తన ఎగ్జైట్మెంట్ని వెల్లడించినట్టు సమాచారం. ఈ సినిమాలో నటించేందుకు ఆయన సుముఖతని వ్యక్తం చేశారట.
దీంతోపాటు ఓ బాలీవుడ్ హీరోని కూడా తీసుకోవాలనుకుంటున్నారట రాజమౌళి. ఆయన ఎవరనేది తెలియాల్సి ఉంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఈ రెండు పాత్రలు నెగటివ్ రోల్స్ అని సమాచారం. అందుకు తమిళం నుంచి ఓ స్టార్ని, హిందీ నుంచి ఓ స్టార్ని తీసుకుంటే మార్కెట్ పరంగా వర్కౌట్ అవుతుందని భావిస్తున్నారట రాజమౌళి. అందులో భాగంగా కార్తిని అనుకున్నట్టు సమాచారం. ఇదే నిజమైతే మహేష్ సినిమా అంచనాలకు ఆకాశం కూడా సరిపోదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇదిలా ఉంటే ఇది ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే చిత్రమని, ఇందులో మహేష్ ప్రపంచాన్ని చుట్టేసే సాహసికుడిగా కనిపిస్తారని రాజమౌళి తెలిపారు. అంతర్జాతీయ యాక్షన్ ఫిల్మ్ గా దీన్ని తీర్చదిద్దాలనుకుంటున్నారట. ఆ క్రమంలోనే భారీ కాస్టింగ్ ని తీసుకోవాలనుకుంటున్నారట. మరి ఇందులో నిజానిజాలేంటనేది తెలియాల్సి ఉంది. ఈ ఏడాది చివరి వరకు దీనిపై పూర్తి స్థాయిలో ఓ క్లారిటీ రానుంది.
మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్తో `ఎస్ఎస్ఎంబీ28` చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. హారికా అండ్ హాసిని చిత్రంపై ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్లో విడుదల కానుంది. రాజమౌళి సినిమా వచ్చే ఏడాది ప్రారంభంలో స్టార్ట్ కానుందని సమాచారం.