పాన్ ఇండియా స్టార్ టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాల్లో ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమాల్లో ఖచ్చితంగా ఆదిపురుష్ ఒకటి. ఇటీవలే ఈ చిత్ర టీజర్ విడుదలైనప్పటి నుంచి విపరీతంగా విమర్శలు వస్తున్నాయి. దీనిపై పలువురు రాజకీయ ప్రముఖులు, హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాదు ఇది యానిమేటెడ్ చిత్రంలా ఉందంటూ ఫ్యాన్స్‌ సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు.అయినా కానీ ఈ టీజర్ రికార్డులు బాగా క్రియేట్ చేసింది. ఒక రేంజ్ లో హిట్ అయ్యింది.పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 12 ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇక ఆదిపురుష్ కథ విషయానికొస్తే.. చెడుపై మంచి గెలుపు చుట్టూ సాగే కథ ఇది. ప్రభాస్‌ రాముడుగా, కృతిసనన్‌ జానకిగా, సైఫ్‌ అలీఖాన్‌ రావణాసురుడుపాత్రల్లో కనిపిస్తారు.


త్రీడీతోపాటు, ఐమాక్స్‌ ఫార్మేట్‌లో ఈ సినిమా ప్రేక్షకుల్ని అలరించనుంది. అయితే ఈ మూవీ రిలీజ్‌కు ముందే దర్శకుడు ఓం రౌత్‌ ఖరీదైన లగ్జరీ కారును బహుమతిగా అందుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఆది పురుష్‌ మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తున్న టీ-సిరీస్‌ అధినేత భూషన్‌ కుమార్‌.. ఓం రౌత్కు రూ.4.02 కోట్ల విలువైన కారు గిఫ్ట్ ఇచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే అసలు నిజం అది కాదు. సరదాగా ఓం రౌత్, భూషన్ కుమార్ ఒక ఫొటో తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారట. దీంతో లగ్జరీ కారు గిఫ్ట్గా ఇచ్చినట్లు ఊహాగానాలు వచ్చాయి. ఇక ఆదిపురుష్ కచ్చితంగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డులు తిరగరాస్తుందట. సినిమా రిలీజ్ కి ఇంకా టైం ఉండటంతో గ్రాఫిక్స్ పై ఇంకా ఎక్కువ కాన్సంట్రేషన్ చేస్తున్నారట. ఖచ్చితంగా ఇది మరిచిపోలేని అనుభూతిని ప్రేక్షకులకు ఇస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. మరి చూడాలి ఆ అనుభూతి ఎలా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: