సినీ ఇండస్ట్రీ అంటేనే ఓ మాయాలోకం . ఓరంగుల ప్రపంచం. ఇలాంటి గ్లామరస్ రంగుల ప్రపంచంలో ఎప్పుడు ఏదైనా కూడా జరగొచ్చు . అప్పటివరకు స్టార్ గా ఉన్న హీరోస్ ..రాత్రికి రాత్రి జీరో అయిపోతారు .

ఒక్క షో హిట్టు పడితే ఆకాశానికి ఎత్తేసి జనాలు.. ఒక్క షో ఫ్లాప్ అయితే పాతాళానికి తొక్కేస్తారు . ఇలాంటివి సినీ ఇండస్ట్రీలో చాలా కామన్ . అయితే కొందరు మాత్రం స్టేటస్ సెలబ్రిటీ అంటూ రేంజ్ చూడకుండా ప్రేమ ఆప్యాయతలను అయితే పంచుతారు. అలాంటి వారిలో కచ్చితంగా నందమూరి హీరో ముందు వరుసలో ఉంటారు.

 

ఆయన మరెవరో కాదు జూనియర్ తారక్ . ఎస్ ఇదే మాట ఇప్పటికే చాలామంది జనాలు చెప్పుకొచ్చారు. ఏకంగా కోటా శ్రీనివాసరావు లాంటి సీనియర్ యాక్టర్లు కూడా సినీ ఇండస్ట్రీకి జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోనే కావాలి అంటూ ఓపెన్ గానే స్టేట్మెంట్ ఇచ్చారట.. ఒక నటుడిగా ఒక మనిషిగా.. మానవత్వం కలిగిన ఓ మగాడిగా ఇండస్ట్రీకి జూనియర్ ఎన్టీఆర్ లాంటి అబ్బాయి హీరోగా ఉండాలి అంటూ చెప్పకు వచ్చారు. కాగా ఇప్పుడు అదే మాటలను మరోసారి గుర్తు చేసిందట మమత మోహన్ దాస్.

 

బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు తెలుగులో చాలా సినిమాల్లో కూడా నటించింది . చిరంజీవి నాగార్జున సినిమాల్లో మెరిసి స్టార్ హీరోయిన్ లిస్టులోకి యాడ్ అయింది . అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల మమతా మోహన్ దాస్ సినీ ఇండస్ట్రీకి దూరమైంది. ఆమె ఆరోగ్యం బాగోలేని కారణంగా మమత కొన్నాళ్లు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉండింది. ఈ క్రమంలోనే సినీ ఇండస్ట్రీలో తనతో పని చేసిన హీరోలు ఎవరు కూడా తనకి కాల్ చేసి ఎలా ఉన్నావ్ అని కనీసం పలకరింపు కూడా లేదని ..కేవలం తారక్ ఒక్కడే కాల్ చేసి పలకరించాడని .. నేను ఆయనతో చేసింది ఒకే ఒక్క సినిమా అని కానీ ఆయన నన్ను గుర్తు పెట్టుకొని పలకరించడం నాకు చాలా ఆనందంగా అనిపించిందని ..నేను చాలా మంది హీరోలతో చేశాను,, కానీ ఎవరు నన్ను అలా గుర్తు పెట్టుకొని మాట్లాడించలేదని చెప్తూ ఎమోషనల్ అయినట్లు సోషల్ మీడియాలో తెగ వార్తలు వినిపిస్తున్నాయి . ఏది ఏమైనా సరే ఇండస్ట్రీకి నిజమైన హీరో ఒక్కమగాడు ఎన్టీఆర్ అంటున్నారట నందమూరి ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: