సాలిడ్ కమర్షియల్ హిట్ కోసం అల్లు వారి అబ్బాయి శిరీష్ చాలా కాలంగా ట్రై చేస్తున్నారు. పరిశ్రమకు వచ్చి పదేళ్లు అవుతున్నా బ్రేక్అయితే రాలేదు.

దీంతో ఊర్వశివో రాక్షసివో మూవీతో గట్టిగా కొట్టాలని చూస్తున్నాడు. నవంబర్ 4న గ్రాండ్ గా విడుదల కానుంది. దీంతో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. నటసింహం బాలయ్య ఊర్వశివో రాక్షసివో గెస్ట్ గా హాజరయ్యారట.

ఈ సందర్భంగా బాలకృష్ణ స్వర్గీయ అల్లు రామలింగయ్య గుర్తు చేసుకున్నారు. ఆయనతో ఎన్టీఆర్ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గీతా ఆర్ట్స్ ప్రస్థానం, నా కెరీర్ ఒకసారే మొదలయ్యాయని బాలయ్య వెల్లడించారు.అల్లు శిరీష్ గురించి మాట్లాడుతూ... అల్లు శిరీష్ గురించి చాలా మంది చెబితే విన్నాను. అతడు నా కుర్చీకే ఎసరు పెట్టే ప్రయత్నం చేశాడని అన్ స్టాపబుల్ షోని ఉద్దేశించి అన్నారట.. ఇక ఊర్వశివో రాక్షసివో ట్రైలర్ చూశాను. సినిమాలోనేనా లేక బయట కూడా అలానే ఉంటావా? అని బాలయ్య శిరీష్ ని సరదాగా అడిగారు. దానికి శిరీష్ లేదు అని సమాధానం చెప్పాడు. అన్ స్టాపబుల్ షోకి పిలిచి నీ రహస్యాలన్నీ బయటకు లాగుతానని బాలయ్య కూడా అన్నారు.

ఊర్వశివో రాక్షసివో హీరోయిన్ అను ఇమ్మానియేల్ గురించి కూడా బాలకృష్ణ ప్రత్యేకంగా మాట్లాడారు. చిత్ర దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్ లపై ప్రశంసలు కురిపించారు. మూవీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని బాలయ్య విశ్వాసం వ్యక్తం చేశారు. ట్రైలర్ కలర్ ఫుల్ గా ఉంది. సినిమా కూడా చాలా బాగుంటుందని అన్నారు. అలాగే బాలయ్య తన అభిమానులను ఉద్దేశించి మాట్లాడారట.. అభిమానులకు నచ్చని పనులు చేయను అన్నారు. అంటే వాళ్ళు ఇష్టపడే కమర్షియల్ చిత్రాలు మాత్రమే చేస్తానని పరోక్షంగా చెప్పారు. నటన అంటే పరకాయ ప్రవేశమన్న బాలకృష్ణ, ఏ పాత్ర అయినా నేను చేయగలను అనుకోవడం తగదు అన్నారు. బాలయ్య స్పీచ్ ఊర్వశివో రాక్షసివో చిత్ర యూనిట్లో విశ్వాసం గా కనిపించింది

మరింత సమాచారం తెలుసుకోండి: