హీరో నందు హీరోగా పలు సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. కానీ ఏ ఒక్క సినిమా కూడా ఆయనకు సక్సెస్ ని తీసుకు రాలేక పోయాయి.కేవలం సినిమా పై ఆధార పడితే సరిపోదనే ఉద్దేశ్యంతో సిరీస్ లు మరియు టీవీ చానల్స్ లో ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాడు. చాలా రోజుల క్రితం బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సినిమాను నందు పూర్తి చేశాడు. కొన్ని కారణాలవల్ల సినిమా విడుదల ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ వారం సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మి గౌతమ్ మరియు హీరో నందు ల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు కాస్త ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తుంది.


చాలా సంవత్సరాల క్రితం గుంటూరు టాకీస్ అనే సినిమాలో సిద్దు జొన్నలగడ్డతో రష్మీ గౌతమ్ చేసిన రొమాన్స్ ఇప్పటికే జనాలు మర్చి పోవడం లేదు. ఆ రేంజ్ లో కాకున్నా కచ్చితంగా బొమ్మ బ్లాక్ బస్టర్ లో నందు మరియు రష్మి గౌతమ్ ల యొక్క రొమాన్స్ పిక్స్ లో ఉంటుందని జనాలు మాట్లాడుకుంటున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ మరియు సినిమా మేకింగ్ విజువల్స్ ప్రస్తుతం సినిమా లో నందు మరియు రష్మి గౌతమ్ యొక్క రొమాంటిక్ సన్నివేశాల కోసమైనా సినిమా ని చూడాలని కోరుకుంటున్నట్లుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక ఈ సినిమా లో నటించినందుకు గాను రష్మి గౌతమ్ భారీ పారితోషికం పొందినట్లుగా సన్నిహితుల ద్వారా సమాచారం అందుతుంది. రోజు వారి పారితోషికం కాకుండా సినిమా కు ఆమె బల్క్ రెమ్యూనరేషన్ పొందిందట..మాములుగా కంటే డబల్ పేమెంట్ తీసుకున్నట్లు సినీ వర్గాల్లో టాక్..


సినిమా లో ఒకటి రెండు సందర్భాల్లో మాత్రమే రొమాంటిక్ సీన్స్ ఉంటాయని.. అయినా కూడా ఆమె ఎక్కువగానే చార్జ్ చేసింది అంటూ ప్రచారం జరుగుతుంది. జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ ఇంకా పలు కార్యక్రమాల్లో రెగ్యులర్ గా కనిపిస్తూ భారీగా పారితోషకం తీసుకుంటున్న రష్మి గౌతమ్ ఇలాంటి రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం అవసరమా అంటూ కొందరు కామెంట్ చేస్తుంటే మరి కొందరు మాత్రం ముందు ముందు మరిన్ని రొమాంటిక్ సినిమాల్లో నటించాలని రష్మి గౌతమ్ ను కోరుతున్నారు. రష్మి గౌతం బొమ్మ బ్లాక్ బస్టర్ తర్వాత వరుసగా సినిమాలు చేస్తుందానేది చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: