ఎగ్జిబిటర్స్ కలిసి పూరి జగన్నాథ్ ఇంటి ముందు ధర్నా చేయాలని నిర్ణయం తీసుకోవడంతో వీరి వెనుక డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను మరియు ఫైనాన్షియల్ శోభన్ బాబు ఉన్నారంటూ పూరి జగన్నాథ్ పోలీస్ కేసులో ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో ఈ గొడవ మరింత ముదిరిపోయింది. అప్పటినుంచి ఈ వ్యవహారంపై పలు చర్చలు జరుగుతూనే ఉన్నాయి అయితే ఇప్పుడు లైగర్ సినిమా విషయంలో ఇంత చర్చ జరుగుతున్నప్పటికీ హీరో విజయ్ దేవరకొండ మాత్రం ఈ విషయం పైన ఏవిధంగా స్పందించలేదు. తన పేరు మీద గానే మార్కెట్ అవుతున్న సినిమా ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో హీరో పఫేమ్ ఏం ఉండదని హిట్ అయిన ఫ్లాప్ అయిన లాభనష్టాలతో అతనికి ఏమి సంబంధం ఉండదు.
కాకపోతే తన సినిమా కారణంగా నష్టపోయారు కదా అని కొంతమంది హీరోలు మాత్రం ఎంతో కొంత ఇస్తూ ఉంటారు. అందులో ఇక్కడ లైగర్ సినిమాపై హై క్రియేట్ అవ్వడానికి ప్రధాన కారణం విజయ్ దేవరకొండ కానీ తన సినిమా వసూళ్లు రూ. 200 కోట్ల నుంచి ప్రారంభమవుతాయని ఇండియా మొత్తం షేర్ చేస్తుందని చాలా సార్లు తెలియజేస్తూ ఉండేవారు దీంతో ఈ సినిమాకి మంచి హైట్ నెలకొన్నడంతో ఈ సినిమాను బయర్లు సైతం కొనడం జరిగిందట. అయితే ఈ సినిమా భారీ డిజాస్టర్ కావడంతో నష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది దీంతో కొంతమంది నెటిజన్లు విజయ్ దేవరకొండ ఈ విషయం పైన స్పందిస్తే బాగుంటుందని కామెంట్లు చేస్తున్నారు.