టాలీవుడ్లో మహేష్ అభిమానులే కాకుండా సినీ ప్రేక్షకులు సైతం ఈయన సినిమాల కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. తాజాగా మహేష్ బాబు తన 28వ సినిమాని డైరెక్టర్ త్రివిక్రమ్ తో చేయబోతున్నట్లు తెలిసిన విషయమే. ఇందులో హీరోయిన్గా పూజ హెగ్డే కూడా ఎంపిక అయింది. ఇక ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఇటీవల పూర్తి చేసుకోగా కొన్ని కారణాల చేత రెండవ షెడ్యూల్ కాస్త ఆలస్యం అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా సెకండ్ షెడ్యూల్ ని కూడా త్వరలోనే పూర్తి చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.


ఈ మధ్యనే స్క్రిప్ట్ విషయంలో మహేష్, త్రివిక్రమ్ మధ్య కొన్ని చర్చలు జరిగాయని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్ లండన్ కి వెళ్లే ముందు స్క్రిప్ట్ లో పలుమార్పులు చేయాలని సూచించగా తన ట్రీట్మెంట్ ముగించుకొని వచ్చేలోగా త్రివిక్రమ్ ఆయన చెప్పినట్లుగా పలు మార్కులు చేసి ఉంచినట్లుగా సమాచారం. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయాలని డైరెక్టర్, నిర్మాతలు ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇక అందుచేతనే ఈ సినిమా కథ కూడా చాలా పగడ్బందీగా ఉండాలని మహేష్ బాబు కూడా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక రాజమౌళితో తెరకెక్కించే సినిమాను కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక మహేష్ బాబు తన 28వ సినిమా సెకండ్ షెడ్యూల్ నవంబర్ మూడవ వారం నుంచి మొదలు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ సినిమాకు సంబంధించి ఇంపార్టెంట్ సీన్స్ షూట్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ క్రేజీ కాంబినేషన్లో గతంలో రెండు సినిమాలు విడుదలవగా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఇక పూజ హెగ్డే కూడా ఈ సినిమాని త్వరగా పూర్తి చేసి సక్సెస్ అందుకోవాలని చాలా ఆత్రుతగా ఎదురు చూస్తోంది. ఇక మహేష్ బాబు కూడా ఈ షెడ్యూల్ కి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: