సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్నాడు..ప్రేక్షకులను ఆకట్టుకుంటూ బాగా ఫెమస్ అయ్యాడు..మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తుండగా, . ఈ సినిమా ఆమధ్య హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఫస్ట్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఇక లేటెస్ట్‌గా రెండో షెడ్యూల్‌ విషయంలో కొత్త అప్ డేట్ వచ్చింది. రెండో షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ ప్రత్యేక సెట్‌లో షూట్ రెస్యూమ్ కానుందని తెలుస్తోంది. ఇక దాదాపుగా ఓ 12 సంవత్సరాల తర్వాత మహేష్ బాబుతో చేస్తున్న ఈ మూవీని త్రివిక్రమ్ అందరి అంచనాలు అందుకునేలా తెరకెక్కిస్తున్నారట.


సర్కారీ వారి పాట సినిమాతో క్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న మహేశ్ ప్రస్తుతం త్రివిక్రమ్‌తో చేస్తుండగా, ఇది పూర్తయ్యాక రాజమౌళితో ప్రతిష్టాత్మకమైన సినిమాని తీయ్యడానికి రెడీ గా ఉన్నాడు. ఈ సమయంలో మహేష్ బాబుకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. మహేష్ బాబు ఇన్నాళ్ల తన కెరీర్ లో ఎన్నో హిట్లు ఫ్లాప్ లు రుచి చూశాడు . అయితే మహేష్ బాబు ఇప్పటివరకు మేకప్ లేకుండా చేసిన ఒకే ఒక్క సినిమా నిజం. సహజంగా కనిపిస్తే బాగుండు అని భావించారు..అయితే సినిమా పెద్దగా హిట్ అవ్వలేక పోయింది..


నిజం కోసం నిజాయితీగా పోరాడిన ఓ కుర్రాడిగా మహేష్ బాబు అందరి మనసులను దోచుకున్నాడు మహేష్ బాబు . ఈ సినిమా మహేశ్ అభిమానులకు చాలా బాగా నచ్చింది. నిజం సినిమా కోసం మహేష్‌ బాబుకు తేజ భారీ రెమ్యూనరేషన్ ఇప్పించినట్టుగా చెబుతారు. అప్పటికి ఇంకా ఒక్కడు సినిమా రిలీజ్ కాలేదని, బాబీ సినిమా కోసం నలభై లక్షల వరకు తీసుకునేవాడని, కానీ తాను మాత్రం కోటి ఇరవై లక్షలు ఇప్పించానంటూ మహేష్ బాబు రెమ్యూనరేషన్ గురించి డైరెక్టర్ బయట పెట్టాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: