అలనాటి కాలంలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించిన రవీనా టాండన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ బాలకృష్ణ హీరోగా రవి రాజా పినిశెట్టి దర్శకత్వం లో తెరకెక్కిన బంగారు బుల్లోడు మూవీ ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ తో ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది.  రవీనా టాండన్ కేవలం తెలుగు సినిమాలలో మాత్రమే కాకుండా అనేక హిందీ మూవీ లలో కూడా నటించి బాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా రవీనా టాండన్ , యాష్ హీరో గా , శ్రీ నిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ లో కీలక పాత్రలో నటించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఈ మూవీ ద్వారా రవీనా టాండన్ దేశ వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే రవీనా టాండన్ తనకు ఎదురైన కొన్ని భయానిక పరిస్థితులను గురించి తాజాగా చెప్పుకొచ్చింది.

ఒక వ్యక్తి తనపై అభిమానం , ప్రేమ పేరుతో రక్తంతో రాసిన లేఖలు , అశ్లీల చిత్రాలు కొరియర్ ద్వారా పంపేవాడు అని తాజాగా రవీనా టాండన్ ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.  ఒక వ్యక్తి తన ఇంటి బయట రెక్కీ కూడా చేసేవాడు అని , తన భర్త , పిల్లలతో వెళ్తుంటే కారుపై పెద్ద రాయి విసిరాడు అని పేర్కొంది. ఈ ఘటనతో తీవ్రంగా భయపడి పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పింది. ఇలా  రవీనా టాండన్ తన జీవితం లో ఎదురైనా భయానక పరిస్థితుల గురించి తాజా ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: