కిరిక్ పార్టీ చిత్రం ద్వారా మొదటిసారి కన్నడ సినీ పరిశ్రమకు పరిచయం అయింది హీరోయిన్ రష్మిక.. ఇక తర్వాత నాగశౌర్య నటించిన ఛలో చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంటర్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. అలా వరుస సినిమాలతో దూసుకుపోతోంది ఇటీవల కాలంలో స్టార్ స్టేటస్ ను అందుకున్నది. పుష్ప చిత్రంతో పాన్ ఇండియా హీరోయిన్గా కూడా గుర్తింపు సంపాదించింది. ఈ సమయంలోనే బాలీవుడ్లోకి అడుగుపెట్టి బిజీ హీరోయిన్గా మారిపోవాలని చూసింది. ఇటీవలే తను నటించిన గుడ్ బై చిత్రం విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.


తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం గురించి తెలియజేసింది రష్మిక. కిరీక్ పార్టీ  సినిమాలో అవకాశం ఎలా వచ్చిందో ఆమె వివరిస్తూ కాలేజీలో చదువుతున్నప్పుడు తాను కొంత మోడలింగ్ చేశానని టైమ్స్ ఆఫ్ ఇండియా మొదటి పేజీలో తన ఫోటో ఒకటి ప్రచురించబడిందని అది చూసిన ప్రొడక్షన్ హౌస్ నుండి తనకు ఫోన్ చేసి సినిమా ఆఫర్ ఇచ్చారని అలా మొదటి సినిమా అవకాశం వచ్చిందని తెలిపింది. అయితే రష్మిక అక్కడ తనకు మొదట అవకాశం ఇచ్చిన బ్యానర్ పేరు మాత్రం తెలపలేదు. కిరిక్ పార్టీ చిత్రం ఆమె మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి స్వీయ నిర్మాణంలో అతని సోదరుడు కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కించారు అయితే వీరిద్దరూ పేర్లను రష్మిక ఎక్కడ ప్రస్తావించలేదు దీంతో ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతోంది.

తన కెరియర్ మొదటి నుంచి తను చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ముఖ్యంగా ట్రోలింగ్స్ నెగెటివిటీ వంటివి ఎదుర్కొంటూ వస్తున్నారని తాజాగా రెండు రోజుల క్రితం ఒక పోస్ట్ ని షేర్ చేయడం జరిగింది. దీంతో మొదటి నుంచి తనకు అండగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞత తెలియజేస్తుంది రష్మిక. మీ కోసం నేను కష్టపడి పని చేస్తాను అంటూ రాసుకు వచ్చింది రష్మిక.

మరింత సమాచారం తెలుసుకోండి: