టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు పొందారు దిల్ రాజ్ ప్రస్తుతం తమిళ హీరో విజయ్ దళపతితో వారసుడు సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. అలాగే రామ్ చరణ్ తో RC -15 చిత్రాన్ని కూడా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాని డైరెక్టర్ శంకర్ తెరకెక్కించడం జరుగుతోంది. అయితే భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా లోని కొన్ని సన్నివేశాలు పాటలకు ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ దర్శకుడితో సినిమా చేసే నిర్మాతలు ముందే వాటికోసం సపరేట్గా బడ్జెట్ను కేటాయించుకొని రంగంలోకి దిగుతూ ఉంటారని చెప్పవచ్చు కానీ దిల్ రాజు ఎంత పెద్ద స్టార్ హీరోలతో సినిమాలు చేసిన బడ్జెట్ మాత్రం కంట్రోల్ లోనే ఉంటుందని చెప్పవచ్చు.


ప్రతి రూపాయి చాలా జాగ్రత్తగా కథకు అవసరమనుకుంటేనే ఖర్చు చేస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అనవసరపు హంగుల కోసం ఏమాత్రం కూడా ఒక రూపాయి ఖర్చు పెట్టారు దిల్ రాజ్. అలాంటిది ఇప్పుడు శంకర్ డైరెక్షన్లో వస్తున్న RC -15 చిత్రం కోసం భారీ ఖర్చు చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇండస్ట్రీలో కూడా శంకర్ సినిమా అంటే భారీ బడ్జెట్ చిత్రం అని పేరు బాగా పాపులర్ అయిందని చెప్పవచ్చు.


ఇక దిల్ రాజు గత చిత్రాల మాదిరిగా కాకుండా ఈ చిత్రానికి చాలా ఎక్కువగానే పెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ముఖ్యంగా ఒక హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశం కోసం దాదాపుగా రూ.10 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇక మరొక సాంగ్ కోసం రూ.15 కోట్ల రూపాయలు కేటాయించినట్లుగా రూమర్లు పెడుతున్నాయి. రామ్ చరణ్ , కియారా అద్వానీ  ఒక పాట కోసం రూ. 15 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం అంటే అది చాలా పెద్ద సాహసమని చెప్పవచ్చు. సౌత్ ఇండస్ట్రీలోని ఇదొక కాస్ట్లీ సాంగ్ అని కూడా చెప్పవచ్చు. ఒక ఈ సినిమాకు బడ్జెట్ కూడా చాలా పెరిగిపోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏ మేరకు సినిమా సక్సెస్ అవుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: