మల్లు డైరెక్టర్ జీతూ జోసెఫ్  క్రియేట్  చేసిన అద్భుత క్రైమ్ సస్పెన్స్  థ్రిల్లర్  దృశ్యం మూవీ గురించి దేశం అంతటా కూడా తెలిసిందే.మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్  ఇంకా మీనా కలిసి నటించిన ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఘన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా హిట్ కావడంతో దీనికి సీక్వెల్ గా దృశ్యం 2 సినిమాను కూడా తెరకెక్కించారు. ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఎక్కడా నిరాశపరచకుండా మంచి వసూళ్లను సాధించింది. ఈ రెండు పార్ట్ లను తెలుగులో కూడా రీమేక్ చేశారు. ఈ సినిమాలో వెంకటేష్ హీరోగా ఇంకా మీనా హీరోయిన్ గా నటించి మెప్పించారు.తెలుగులోనూ సేమ్ రిజల్ట్ రిపీట్ అయింది. కోలీవుడ్ లో కూడా ఈ సినిమా రీమేక్ అయ్యి  సూపర్ డూపర్ హిట్ అందుకుంది.ఇప్పటికే అన్ని భాషల్లో హిట్ అయిన దృశ్యం సీక్వెల్ ను కష్టాలలో ఉన్న బాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ కొట్టాలని ప్రయత్నం చేసింది.


అయితే దృశ్యం సినిమా ఇప్పటికే మూడు భాషలలో రావడం ఇంకా ఓటిటి లలో కూడా సందడి చేసి హిట్ ను అందుకోవడంతో బాలీవుడ్ మేకర్స్ కూడా ఈ సినిమాని రీమేక్ చేసి హిట్ కొట్టాలనుకున్నారు. ఒక మంచి కథను సరిగ్గా డీల్ చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి బాలీవుడ్ లో నిరూపితం అయింది. ఈ సినిమాను అభిషేక్ పాఠక్ డైరెక్ట్ చేయగా, అజయ్ దేవగన్, శ్రియ, అక్షయ్ ఖన్నా ఇంకా టబు లు కీలక పాత్రలు చేశారు.విడుదల అయిన దగ్గర నుండి ఈ సినిమాకు మంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మంచి కలెక్షన్ లను సాధిస్తాయని నమ్మకంతో చిత్ర బృందం ఉందట.అందుకే అదనపు షో లు కూడా వేశారు. అయితే ఈ సినిమాకి భారీ కలెక్షన్ లు వచ్చినా బాలీవుడ్ కి మంచి హాట్ అనే చెప్పవచ్చు. చూడాలి ఇక ఈ సినిమా మ్యాజిక్ ఎలా ఉంటుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: