తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి గురించి అలాగే నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా వీరిద్దరికీ ఇండస్ట్రీలో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలోనే ఆరుపదుల వయసుకు చేరువలో ఉన్నప్పటికీ ఇంకా వీరి సినిమాలు విడుదలవుతూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరొకసారి తమ వారసులకే గట్టి పోటీ చేస్తూ తమ సినిమాలను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు.  చిరంజీవి, బాలకృష్ణ ఈ క్రమంలోనే వీరిద్దరు నటించిన సినిమాలు సంక్రాంతి బరిలో పోటీ పడుతున్నాయని తెలిసిన విషయమే. ఈ రెండు సినిమాలు ఏ రోజున రిలీజ్ కాబోతున్నాయి అనే వార్త మాత్రం ఇంకా మిస్టరీగానే ఉంది.  కానీ ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఖరారు చేశారు చిత్ర బృందం.

నటసింహ బాలకృష్ణ అఖండ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే మరొక మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.  గోపీచంద్ మలినేని దర్శకుడిగా శృతిహాసన్ హీరోయిన్గా , బాలయ్య హీరోగా తెరకెక్కుతున్న వీరసింహారెడ్డి సినిమాను సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12వ తేదీన థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు సమాచారం. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


మరొకపక్క చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.  అయితే ఈ సినిమాలో కూడా హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తోంది.ఈ సినిమాను జనవరి 13వ తేదీన థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇలా ఈ రెండు సినిమాలు కూడా ఒక సినిమా తర్వాత మరొకటి థియేటర్లలోకి వచ్చి సంక్రాంతి పండుగను మరింత పండగమయం చేయబోతున్నాయి. సంక్రాంతి పండుగకు ఎలాగో మూడు రోజుల సెలవు దినం ప్రకటిస్తారు కాబట్టి ఈ మూడు రోజులు థియేటర్లు ప్రేక్షకులతో హౌస్ ఫుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చిత్ర బృందాలు ఆలోచన చేస్తున్నాయి. ఏది ఏమైనా ఈ రెండు సక్సెస్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: