మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూ వీకి పవర్ ,  సర్దార్ గబ్బర్ సింగ్ , జై లవకుశ ,  వెంకీ మామ మూవీ లకు దర్శకత్వం వహించిన బాబి దర్శకత్వం వహిస్తూ ఉండగా , టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి శృతి హాసన్మూవీ లో మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తోంది. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మాస్ మహారాజా రవితేజమూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటించింది.

మూవీ విడుదల తేదీ దగ్గర పడడం తో ప్రస్తుతం వాల్తేరు వీరయ్య మూవీ యూనిట్ ఈ సినిమా షూటింగ్ ను ముగించే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ యూనిట్ ప్రస్తుతం ప్రాన్స్ లో మెగాస్టార్ చిరంజీవి మరియు శృతి హాసన్ లపై ఒక అదిరిపోయే సాంగ్ ను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ "నువ్వు శ్రీదేవి అయితే ... నేను చిరు ని అవుతా" అంటూ సాగబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ నుండి డిసెంబర్ 12 వ తేదీ నుండి మాస్ మహారాజ రవితేజ కు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ను ఈ మూవీ యూనిట్ విడుదల చేయబోతుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా చిత్ర బృందం విడుదల చేసింది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి బాస్ పార్టీ అనే సాంగ్ ను చిత్ర బృందం విడుదల చేయగా , ఆ సాంగ్ ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: