టాలివుడ్ యంగ్ హీరో నితిన్ బ్యాక్ టూ బ్యాక్ రీమెక్ సినిమాలను చేస్తున్నాడు. ఇటీవల మాచర్ల నియోజకవర్గం' బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ మూవీగా నిలిచింది. ఈ సినిమాను యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కించగా, సినిమాలోని రొటీన్ సబ్జెక్ట్ ప్రేక్షకుల ను ఆకట్టుకోవడం లో ఫెయిల్ అయ్యింది. ఇక ఈ సినిమా తరువాత నితిన్ తన నెక్ట్స్ మూవీని ఎవరితో చేస్తాడా అనే ప్రశ్నకు దర్శకుడు వెంకీ కుడుముల రూపంలో సమాధానం లభించింది..


ఈ కొంబొలో వస్తున్న సినిమా ఎలాంటి కథతో వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే తాజాగా వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమా కథకు సంబంధించి ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. నితిన్-వెంకీ కుడుముల కాంబినేషన్‌ లో వస్తోన్న సినిమా స్టోరీలైన్ గతంలో ప్రభాస్ నటించిన ఓ సినిమా ను పోలి ఉంటుందని తెలుస్తోంది. దర్శకుడు కృష్ణవంశీ, ప్రభాస్ కాంబినేషన్‌ లో వచ్చిన 'చక్రం' సినిమా గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఘోర పరాజయాన్ని చవిచూసిందో మనం చూశాం. ఆ సినిమాలో హీరో చనిపోతాడని తనకు ముందే తెలుస్తోంది.


ఇప్పుడు సేమ్ ఇలాంటి స్టోరీలైన్‌తోనే వెంకీ కుడుముల కూడా ఓ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడట. హీరో తాను చనిపోతానని తెలుసుకుని, తన మిగిలి ఉన్న జీవితాన్ని ఎలా గడిపాడు.. అతడికి ఈ క్రమం లో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి అనే యాంగిల్‌ లో సినిమా కథ ఉండబోతుందట. ఇక ఈ కథకు కామెడీ అంశాల ను జోడించనున్నాడట ఈ డైరెక్టర్. మరి ప్రభాస్‌ కు డిజాస్టర్‌ ను మిగిల్చిన 'చక్రం' సినిమా స్టోరీలైన్‌ తో నితిన్ సినిమా చేస్తే, సేమ్ రిజల్ట్ రిపీట్ అవుతుందేమో అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.. అయితే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటనను మాత్రం చెయ్యలేదు.. చూడాలి మరి..

మరింత సమాచారం తెలుసుకోండి: