రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస మూవీ లతో ఫుల్ బిజీగా ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే ఆది పురుష్ మూవీ షూటింగ్ ను పూర్తి చేసుకున్న ప్రభాస్ , ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న సలర్ మూవీ లో నటిస్తున్నాడు. అలాగే నాగ్ అశ్విన్  దర్శకత్వం లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే ,  మారుతీ దర్శకత్వం లో తేరకెక్కుతున్న మూవీ షూటింగ్ లలో పాల్గొంటూ వస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ , మారుతీ దర్శకత్వం లో తెరకెక్కుతున్న మూవీ కి డేట్ లను ఇచ్చాడు. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ తాజా షెడ్యూల్ నిన్నటి నుండి ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ కోసం ప్రభాస్ ఒక వారం పాటు కేటాయించ నున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం జరుగుతున్న ఈ మూవీ షెడ్యూల్ నానక్ రామ్ గుడా లో వేసిన ప్రత్యేకమైన ఇంటి సెట్ లో జరుగుతున్నట్లు తెలుస్తోంది  ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో ప్రభాస్ సరసన నిది అగర్వాల్ , మాళవిక మోహన్ , రీద్ధి కుమార్ లు హీరోయిన్ గా నటించబోతున్నారు. సంజయ్ దత్మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని దర్శకుడు మారుతి హారర్ కామెడీ నేపథ్యం లో రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీ కి రాజా డీలక్స్ అనే టైటిల్ ను పెట్టే ఉద్దేశంలో ఈ మూవీ యూనిట్ ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ మూవీ ని దర్శకుడు మారుతి చాలా స్పీడ్ గా రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: