నందమూరి నటసింహం బాలకృష్ణ ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీ కే తన కెరియర్ ను పరిమితం చేసిన ఈయన ఇప్పుడిప్పుడే బుల్లితెరవైపు కూడా అడుగులు వేస్తున్నారు. గత ఏడాది మొదలుపెట్టిన అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె అనే ఒక సెలబ్రిటీ టాక్ షో నిర్వహించి.. సక్సెస్ అయ్యారు. అంతేకాదు మొదట్లో బాలయ్య హోస్ట్గా వ్యవహరించడం చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోవడమే కాదు పలు కామెంట్లు కూడా చేశారు కానీ అందరి నోళ్ళు మూయించేలా ఈ షో దేశంలోనే నెంబర్ వన్ టాక్ షో గా గుర్తింపు తెచ్చుకుంది.

నటసింహం బాలకృష్ణ కి కూడా మంచి గుర్తింపు తీసుకొచ్చింది ఈ షో.. అనంతరం రెండవ సీజన్ ని కూడా మొదలుపెట్టారు. అయితే ఈసారి కొంచెం పొలిటికల్ టచ్ ఇవ్వడం సీజన్ 2 కి ప్లస్ పాయింట్ అయిందని చెప్పాలి. మాజీ ముఖ్యమంత్రులు,  సీనియర్ హీరోలు , హీరోయిన్లు,  యంగ్ హీరోలు కూడా ఈ సీజన్లో వచ్చి అలరిస్తున్నారు. ఈ క్రమంలోని మీడియా ముందుకు రావడానికి పెద్దగా ఆసక్తి చూపని రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఆహా నిర్వాహకుల కోరిక మేరకు బాలయ్య మీద ఉన్న గౌరవంతో పిలవగానే ఈ షో కి హాజరయ్యారు.

దాదాపు చాలాకాలం తర్వాత పాతకాలపు ప్రభాస్ ను చూస్తున్నాము అని అభిమానులు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ తాను గతంలో ఎలా ఉండేవాడో అలాగే నటించి.. మాట్లాడుతూ.. తన లుక్కుతో తన అభిమానులను పూర్తిస్థాయిలో ఆకట్టుకున్నాడు. ఏది ఏమైనా మళ్లీ పాతకాలపు ప్రభాస్ ని చూసి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.  ఇకపోతే ఈ కార్యక్రమానికి ఆయన ప్రాణ స్నేహితుడు మ్యాచో స్టార్ గోపీచంద్ కూడా హాజరయ్యారు. ఈ షోలో వీరు ముగ్గురు ఆద్యంతం ప్రేక్షకులను అలరిస్తూనే.. మరొకపక్క ఒకరినొకరు ఇరికించే ప్రయత్నం చేసుకున్నారు. మొత్తానికైతే ఈ ఎపిసోడ్ శుక్రవారం విడుదల కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: