టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన రోజా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. స్టార్ హీరోయిన్ గానే కాకుండా పొలిటీషియన్ గా కూడా తనకంటూ ఒక మంచి గుర్తింపును పొందింది ఈమె. ఇటీవల నటనకు గుడ్ బై చెప్తూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బిజీగా ఉంది ఈమె. నగరి నియోజక వర్గం నుండి వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున రెండుసార్లు పోటీ చేసింది రోజా. దాని అనంతరం ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిగా కొనసాగుతోంది ఈమె. అయితే రోజా ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ జబర్దస్త్ షోలో జడ్జిగా 

వ్యవహరించిన సంగతి మనందరికీ తెలిసిందే.కానీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం జబర్దస్త్ షో కి గుడ్ బై చెప్పింది రోజా. నటనకు గుడ్ బై చెబుతూ పొలిటిషన్ గా తన జీవితాన్ని కొనసాగిస్తుంది రోజా. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది ఈమె. ఇంటర్వ్యూలో భాగంగా చాలా విషయాలను పంచుకుంది. రాజకీయాల పరంగా రోజా ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటుందో చెప్పుకొచ్చింది. వాటితోపాటు రోజాపై మరియు తన కుటుంబం పై సోషల్ మీడియాలో వస్తున్న రూమర్ల గురించి కూడా స్పందించింది రోజ.ఇందులో భాగంగానే తన కూతురు గురించి మాట్లాడుతూ

 నా కూతురు అన్షు మాలిక చాలా సెన్సిటివ్ అలాంటి నా కూతురుపై సోషల్ మీడియాలో కొందరు ఫోటోలో మార్ఫింగ్ చేసి అసభ్యకరమైన పోస్టులను చేస్తున్నారు. దాంతో ఆ ఫోటోలను చూసిన కూతురు ఎంత బాధ పడిందో నాకే తెలుసు ఆ ఫోటోలను చూసిన అనంతరం ఇవన్నీ మనకు అవసరమా అంటూ నన్ను అడిగింది. దాంతోపాటు నా సోదరుడు గురించి కూడా అప్పట్లో అసభ్యకరమైన కామెంట్లను చేశారు. సెలబ్రిటీలు అయితే ఇలాంటివన్నీ పట్టించుకోరు. కానీ మా పిల్లలు ఏం చేశారు అంటూ ఎమోషనల్ అయింది రోజా. ప్రస్తుతం రోజా చేసిన ఈ కామెంట్లు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: