తమిళ నాట హీరోలకి ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా విజయ్,అజిత్ కి ఒక రేంజిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.ఇద్దరిలో ఎవరు నెంబర్ 1 హీరో అనేది చెప్పడం కష్టం.ఇక ఈ విషయంలో దిల్ రాజు చేసిన కామెంట్స్ ఏ రేంజ్ లో మంటలు రేపుతున్నాయో అందరికి తెలిసిందే. తమిళనాట స్టార్ హీరోల్లో ఎవరు నెంబర్ వన్ అనే చర్చకు దారితీశాయి.ఈమధ్య దిల్ రాజు మాట్లాడుతూ.. అజిత్ కంటే విజయ్ నెంబర్ వన్ హీరో అని కామెంట్ చేశాడు. అంతే అజిత్ ఫ్యాన్స్ ఈ కామెంట్ ల పై భగ్గుమన్నారు. అటు విజయ్ ఫ్యాన్స్ కూడా మేమేమి వారి కంటే తక్కువ కాదు అంటూ ఫైర్ అయ్యారు. ఇక దిల్ రాజు నిర్మించిన వారీసు సినిమా సంక్రాంతి పండుగ కానుకగా విడుదలకు సిద్ధం అవుతోంది. ఇంకా అనే క్రమంలో అజిత్ కుమార్ నటించిన తునివు సినిమా కూడా రిలీజ్ చేయనున్నారు. దాంతో ఈ సినిమాల మధ్య పెద్ద బాక్సాఫీస్ వార్ జరగనుంది. ఈ క్రమంలో దిల్ రాజు చేసిన కామెంట్స్ ఒక రేంజిలో అగ్గిరాజేశాయి.


ఇప్పటికే ఈ ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య  గొడవలు జరుగుతూనే ఉంటాయి. అవి ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఎక్కువయ్యాయి.ఇక ఇదే విషయం పై తమిళ తెలుగు స్టార్ హీరోయిన్ త్రిష స్పందించింది. తాజాగా త్రిష నటించిన రాంగి అనే మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వివిధ ఇంటర్వ్యూల్లో పాల్గొంటుంది త్రిష. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఆమె పాల్గొనగా యాంకర్.. అజిత్, విజయ్ ఇద్దరిలో ఎవరు నెంబర్ వన్ హీరో అనే విషయం పై వివాదం జరుగుతోంది తెలుసా అని ప్రశ్నించారు.ఇక దానికి త్రిష సమాధానం ఇస్తూ ఇలా అంది.వీరు ఇద్దరూ కూడా చాలా పెద్ద నటులు..అంతేగాక చాలా అనుభవం ఉన్న నటులు. ఇద్దరికీ మంచి స్టార్ స్టేటస్ ఉంది. అందుకే వారిలో ఎవరు నెంబర్ వన్ అనేది చెప్పడం చాలా కష్టం అని తెలిపింది. అంతేగాక అసలు నాకు ఈ నెంబర్ గేమ్ పై పెద్దగా నమ్మకం లేదు. మనం నటించిన లాస్ట్ మూవీ కనుక హిట్ అయితే మనమే నెంబర్ వన్..లేదంటే ఆ ప్లేస్ లోకి ఇంకొకరు వస్తారు అని కామెంట్ చేసింది త్రిష.

మరింత సమాచారం తెలుసుకోండి: