పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలలో చాలా బ్లాక్ బస్టర్ సినిమాలో ఉన్నాయి. ఇక అందులో ఖుషి సినిమా కూడా ఒకటి.అయితే తాజాగా ఈ సినిమా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సినిమాని తాజాగా న్యూ ఇయర్ కానుకగా రీ రిలీజ్ చేశారు చంద్రబృందం. ప్రస్తుతం ఈ సినిమా చూసేందుకు పవర్ స్టార్ అభిమానులు థియేటర్ల ముందు క్యూ కడుతున్నారు. అయితే ఈ సినిమా రీ రిలీస్ కు ముందే భారీ స్థాయిలో ఈ సినిమా టికెట్లు అమ్ముడుపోవడం ఇప్పుడు అందరినీ షాప్ కి గురిచేస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ సినిమా దర్శకుడు ఎస్ జే సూర్య ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది.

ఇక ఆ ఇంటర్వ్యూలో భాగంగా ఈన మాట్లాడుతూ.." కోలీవుడ్లో నేను తెరకెక్కించిన వాలి సినిమా అనంతరం నేను హైదరాబాద్ వచ్చినప్పుడు  ప్రొడ్యూసర్ ఎం రత్నం పవన్ కళ్యాణ్ కి నన్ను పరిచయం చేయడం జరిగింది.. ఇక ఆ సమయంలోనే భద్రి , తమ్ముడు సినిమాలతో వరుస హిట్టులను అందుకున్నాడు పవన్ కళ్యాణ్. స్టార్ హీరో అయినప్పటికీ చాలా సింపుల్ గా చిన్న పిల్లాడి లాగా ఉంటాడు పవన్ కళ్యాణ్ అంటూ చెప్పుకొచ్చాడు సూర్య.. అంతేకాదు అన్ని ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన తర్వాత కూడా ఆయన సింప్లిసిటీ చూసి నేను ఆశ్చర్యపోయాను.. దాని తర్వాత ఖుషి సినిమా స్టోరీ ను నేను పవన్ కళ్యాణ్ కి చెప్పడం జరిగింది.. ఇక చెప్పిన వెంటనే ఆ స్టోరీ పవన్ కళ్యాణ్ కు బాగా నచ్చింది..

సినిమా విడుదలైన అనంతరం మంచి హిట్టుడు అందుకుంది.. ఇక అలాంటి హిట్ ని పవన్ కెరియర్ లో నేను ఇప్పటిదాకా చూడలేదు అదే నాకు కొద్దిగా బాధగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.. దాని అనంతరం వీరిద్దరి కాంబినేషన్లో కొమరం పులి అని సినిమా కూడా రావడం జరిగింది..అయితే వీరిద్దరి కాంబినేషన్ లో దాదాపు చాలా లాంగ్ గ్యాప్ తర్వాత విడుదలైన ఈ సినిమా అనుకున్నంతటి విజయాన్ని అందుకోలేకపోయింది.. దాని అనంతరం ఆ రెండు సినిమాల తర్వాత ఇప్పటిదాకా వీరిద్దరి కాంబినేషన్లో ఒక్క సినిమా కూడా రాలేదు.. దీంతో చాలామంది వీరి కాంబినేషన్లో మరో సినిమా వస్తే బాగుంటుంది అని వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: