నందమూరి నట సింహం బాలకృష్ణ ఆఖరుగా అఖండ లాంటి భారీ బ్లాక్ బస్టర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. అఖండ మూవీ తో బాలకృష్ణ భారీ బ్లాక్ బాస్టర్ విజన్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవడం మాత్రమే కాకుండా ఆ మూవీ తో 100 కోట్లకు పైగా కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర కొల్లగొట్టి ... తన స్టామినా ను బాక్స్ ఆఫీస్ దగ్గర అఖండ మూవీ తో మరో సారి నిరూపించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా బాలకృష్ణ "వీర సింహా రెడ్డి" అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ:లో హీరో;గా నటించాడు.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ని మైత్రి సంస్థ నిర్మించగా ... అందాల ముద్దుగుమ్మ శృతి హాసన్మూవీ లో హీరోయిన్ గా నటించింది. వరలక్ష్మి శరత్ కుమార్మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించగా ... దునియా విజయ్ విలన్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ ని జనవరి 12 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. 

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని జనవరి 11 వ తేదీనే యూఎస్ఏ లో ప్రీమియర్స్ వేయనున్నారు. అందులో భాగంగా ఇప్పటికే చాలా రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన యుఎస్ఏ ఫ్రీ బుకింగ్ సేల్స్ మొదలు అయ్యాయి. అందులో భాగంగా వీర సింహా రెడ్డి మూవీ ప్రీమియర్ షో లకు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇప్పటివరకు ఈ సినిమాకు యూఎస్ఏ లో 400 కే ఫ్రీ సేల్స్ జరిగినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. దీనిని బట్టి చూస్తే యుఎస్ఏ లో వీర సింహా రెడ్డి మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నట్లు అర్థం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: