కన్నడలో కిరీక్ పార్టీ అనే సినిమాతో హీరోయిన్గా అవతారం ఎత్తిన రష్మిక ఇక తెలుగులో చలో సినిమాతో ఎంట్రీ ఇచ్చి తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.  ఇక ఆ తర్వాత గీతాగోవిందం సినిమాతో అందరికీ దగ్గర అయింది అన్న విషయం తెలిసిందే. ఇక తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ దక్కించుకొని ఒక్కసారిగా ఫామ్ లోకి వచ్చేసింది. ఇక ఇప్పుడు ఏకంగా స్టార్ హీరోలు అందరి సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది రష్మిక మందన్న.


 పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇటీవల రష్మిక నటించిన విజయ్ వారసుడు, మరోవైపు బాలీవుడ్ లో నటించిన మిస్టర్ మజ్ను సినిమాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి అని చెప్పాలి. ఇలా స్టార్ హీరోల సినిమాతో బిజీబిజీగా ఉన్న రష్మిక మందన.. ఇక ఇటీవల వివాదాలతో కూడా వార్తల్లో నిలుస్తూ ఉంది అని చెప్పాలి. తనపై ఎన్ని ట్రోల్స్ వచ్చినా కూడా వాటికి గట్టిగానే సమాధానం చెబుతుంది ఈ ముద్దుగుమ్మ.


 ఇక ఇప్పుడు ఒక్కో సినిమాకి దాదాపు 6 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది రష్మిక మందన్న అన్నది ఇండస్ట్రీలో టాక్. ఇదిలా ఉంటే ఇటీవల డబ్బు వ్యామోహంతో రష్మిక తీసుకున్న నిర్ణయం అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తుంది అన్నది తెలుస్తుంది.. పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు సంపాదించిన ఎన్టీఆర్ సరసన రష్మికకు ఛాన్స్ వచ్చిందట. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో రష్మికను తీసుకోవాలని అనుకున్నారట. కానీ ఏడు కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో నిర్మాతలు షాక్ అయ్యారట. ఇక అంత రెమ్యూనరేషన్ చెల్లించలేమని రష్మికను పక్కకు పెట్టేసారట. ఈ విషయం తెలిసి ఫాన్స్ షాక్ అవుతున్నారు. ఎన్టీఆర్ సరసన నటించే ఛాన్స్ ఒక్కసారి వస్తే చాలని అందరూ అనుకుంటుంటే రష్మిక మాత్రం డబ్బు వ్యామోహంతో సినిమాను చేజార్చుకుంది అని ఫ్యాన్స్ తిట్టిపోస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: