సినిమా ఎలా ఉంది అనే విషయంపై ఇప్పటికే తెలుగులో కూడా రివ్యూ ఇచ్చేశారు ఎంతోమంది సినీ క్రిటిక్స్. అయితే రొటీన్ కథ అయినప్పటికీ అటు డైరెక్టర్ వంశీ పైడిపల్లి మాత్రం కాస్త కొత్తదనంతో తెరకెక్కించాడు అని ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా సినిమా సాగిపోతూ ఉంటుందని క్రిటిక్స్ చెప్పారు. ఇదంతా పక్కన పెడితే ఇక ఇప్పుడు సినిమాలోని ఒక పాత్ర గురించిన చర్చ మాత్రం సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇప్పటికే కన్నడ తమిళ భాషలో విడుదల కాగా ఇక ఈ సినిమా చూసిన ప్రేక్షకులకు కుష్బూ సినిమాలో ఎక్కడ కనిపించలేదు.
అదేంటి కుష్బూ పాత్రను పూర్తిగా ఎడిటింగ్లో తొలగించేసారా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు అని చెప్పాలి. అయితే వారిసు సినిమా చిత్రీకరణ సమయంలో విజయ్ రష్మిక మందనతో కలిసి కుష్బూ ఒక సెల్ఫీ తీసుకొని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇలాంటి మంచి సినిమాలో చేస్తున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది అంటూ ఒక పోస్ట్ పెట్టింది. దీంతో ఇక వారిసు సినిమాలో కుష్బూ కీలక పాత్రలో కనిపిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ సినిమా మొత్తం ఎక్కడా కుష్బూ కోసం భూతద్దం పెట్టుకొని వెతికిన ఈ సీనియర్ హీరోయిన్ మాత్రం కనిపించలేదు. ఇక తమిళ్లో ఆమెకు వీరలెవల్లో ఫాలోయింగ్ ఉండడంతో ఆమెను చూడడానికే థియేటర్కు వెళ్లిన అభిమానులకు నిరాశే ఎదురయింది. కుష్బూ క్యారెక్టర్ ను తీసేసారా లేకపోతే ఆమెను తీసేసి ఆమె ప్లేస్ లో జయసుధని తీసుకున్నారా అని చర్చ మాత్రం ప్రస్తుతం మొదలైంది అని చెప్పాలి.