పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది రష్మిక మందన. ఇటీవల బాలీవుడ్లో గుడ్ బై అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా అనంతరం ఇటీవల విజయ దళపతి తో వరిసు సినిమాలో కూడా నటించింది ఈమె.సినిమాలతో పాటు తను సోషల్ మీడియాలో కూడా ఎల్లప్పుడూ ఆక్టివ్ గా ఉంటుంది రష్మిక మందన. తనకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. అయితే ఇందులో భాగంగానే ఇప్పుడు అందరి కళ్ళు రష్మిక మందన చేతి పై ఉన్న టాటూ మీద పడింది. 

అయితే రష్మిక మందన  చేతిపై రిప్లైజబుల్ అని ఒక టాటూ ఉంటుంది. ఇందులో భాగంగానే చాలా ఇంటర్వ్యూలలో తన చేతి పై ఉన్న టాటూ గురించి అడిగితే వివిధ రకాలుగా చెప్పొచ్చింది రష్మిక మందన .అయితే తాజాగా మరోసారి తను చేతిపై ఇలా ఎందుకు టాటూ వేయించుకుంది అన్న ప్రశ్నకి సమాధానం చెప్పింది రష్మిక మందన .తాజాగా రష్మిక మాట్లాడుతూ... సాధారణంగా నాకు టాటూ వేయించుకోవడం అంటే ఇష్టం. ఎప్పటినుండో నేను టాటూ వేయించుకోవాలి అని భావిస్తున్నాను. కానీ మా కాలేజీలో టాటూ వేయించుకున్న అబ్బాయిలు అమ్మాయిలు ఆ బాధ ఓర్చుకోలేరు అంటూ చెప్పేవాళ్ళు.. 

వాళ్లందరికీ సుధీలు అంటే చాలా భయమని వాళ్ళు ఎప్పుడూ నాతో చెబుతూ ఉండేవారు. ఇందులో భాగంగానే నాకు సూదులు ఉంటే భయం లేదని వాళ్లతో నిరూపించేందుకే వెంటనే అటాటోని వేయించుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది రష్మిక .వేయించుకోవాలని అనుకున్నప్పటికీ ఎలాంటి టాటూ వేయించుకోవాలి అన్నది మాత్రం తెలియదు. అప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది...ఎవరు మరొకరిని భర్తీ చేయలేరు ప్రతి ఒక్కరూ ముఖ్యమైన వారే అని... అర్థం వచ్చేలా ఈ టాటూ ని నేను వేయించుకోవడం జరిగింది. అంటూ చెప్పుకొచ్చింది రష్మిక మందన..!!

మరింత సమాచారం తెలుసుకోండి: