నందమూరి నటసింహం బాలకృష్ణ బాక్సాఫీస్ దగ్గర ఎట్టకేలకు అదిరిపోయే సూపర్ సెంచరీ కొట్టేసాడు. జనవరి 12వ తేదీన వీర సింహా రెడ్డి సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చిన బాలకృష్ణ కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టాడు.ఫస్ట్ డే 50 కోట్లకి పైగా గ్రాస్ ని రాబట్టిన వీర సింహా రెడ్డి సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే ఏకంగా 104 కోట్ల గ్రాస్ ని రాబట్టి ఇంకా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఆకాశాన్ని తాకే అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకి వచ్చిన వీర సింహా రెడ్డి సినిమా బాలకృష్ణ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అవ్వడానికి రెడీగా ఉంది. బాలయ్యకి పెద్ద డై హార్డ్ ఫ్యాన్ అయిన గోపీచంద్ మలినేని, బాల కృష్ణని ఒక రేంజిలో చూపించి ప్రతి ఒక్కరికీ గూస్ బంప్స్ ఇచ్చాడు. బాలకృష్ణ రాయల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇంకా అలాగే ఆయన చెప్పిన డైలాగ్స్ కి నందమూరి అభిమానులు థియేటర్స్ ని 'జై బాలయ్య' నినాదాలతో బాగా షేక్ చేస్తున్నారు.


మొదటి రోజు బాలయ్య కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ని రాబట్టిన వీర సింహా రెడ్డి సినిమా కలెక్షన్స్ సెకండ్ రోజున కొంచెం డ్రాప్ అయ్యాయి కానీ మూడు, నాలుగు రోజుల్లో మళ్ళీ దూకుడు కనిపించింది. వాల్తేరు వీరయ్య సినిమా రిలీజ్ అవ్వడంతో వీర సింహా రెడ్డి సినిమాకి కొన్ని థియేటర్స్ తగ్గాయి. లిమిటెడ్ థియేటర్స్ తోనే బాలయ్య ఈ రేంజ్ వసూళ్లు సాధించాడు. ఇక సీడెడ్, ఓవర్సీస్ ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ మార్క్ టచ్ చేసిన వీర సింహా రెడ్డి సినిమా ఇప్పుడు చాలా ఫాస్ట్ గా వసూళ్లు రాబడుతుంది. ఇంకా ఈ వీకెండ్ కి అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అవ్వడం కూడా గ్యారెంటీ.ఇక గతంలో అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బాలయ్య ఇప్పుడు ఈ సినిమాతో కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని తన పాత రోజులను మైమరిపిస్తూ దూసుకుపోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: