టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలో చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో తన 28వ సినిమాను చేస్తుండగా.. ఆ వెంటనే దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తన 29వ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా రాజమౌళితో మహేష్ చేయబోయే ప్రాజెక్టు గురించి రోజుకో వార్త ఫిలిం సర్కిల్స్లో హల్చల్ చేస్తోంది. ఇప్పటికే రాజమౌళిసినిమా జోనర్ గురించి వెల్లడించడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళుతుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం రాజమౌళితో మహేష్ చేయబోయే సినిమా షూటింగ్ దసరా తర్వాత స్టార్ట్ అవుతుందట.

అంటే అక్టోబర్ నెలలో ఈ సినిమా సెట్స్ ఫైకి వెళ్లబోతుందని, అందుకు తగ్గట్టు తన షెడ్యూల్స్ ని పూర్తి చేయమని మహేష్ త్రివిక్రమ్ ను ఇటీవల కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ సైతం పాన్ ఇండియా ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అందుకే త్రివిక్రమ్సినిమా కోసం తన పాత ఫార్ములాను వదిలేసి సరికొత్తగా ప్రయత్నం చేస్తున్నాడు. పైగా ఈ సినిమాను తెలుగుతోపాటు హిందీ, మలయాళ, తమిళ, కన్నడ భాషలో ఒకేసారి విడుదల చేసేందుకు భారీగా సన్నాహాలు చేస్తున్నారు. అటు మహేష్ బాబు కూడా పాన్ ఇండియా రిలీజ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. దానికి తోడు హిందీలో స్వయంగా మహేష్ బాబు డబ్బింగ్ చెప్పబోతున్నాడని అంటున్నారు.

మరో మూడు నెలల్లో త్రివిక్రమ్ సినిమా షూటింగ్ని పూర్తి చేసి ఆ వెంటనే రాజమౌళితో అక్టోబర్లో సినిమాను పట్టాలెక్కించాలని మహేష్ బాబు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇక త్రివిక్రమ్ తో మహేష్ చేస్తున్న సినిమా షూటింగ్ ఇప్పటికే రెండు భారీ షెడ్యూల్స్ ని కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పైఎస్. రాదాకృష్ణ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడిగా పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తూ ఉండగా పెళ్లి సందడి బ్యూటీ శ్రీ లీల సైతం ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటిస్తుందని టాక్ వినిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి చిత్ర యూనిట్ ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఆగస్టు 11న ఈ సినిమా విడుదల కానుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: