నందమూరి ఫ్యామిలీకి టాలీవుడ్ ఇండస్ట్రీ లో దాదాపు 6, 7 దశాబ్దాల చరిత్ర ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ ఫ్యామిలీ నుంచి ప్రస్తుతం మూడోతరం హీరోలు కూడా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోలుగా మారిపోయి దూసుకుపోతున్నారు. ఇక అందరూ హీరోలు కూడా తమదైన రీతిలోనే ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ఇక అరుదైన రికార్డులను కూడా సాధిస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇప్పటివరకు ఇలా మిగతా ఫ్యామిలీ ల నుంచి కూడా చాలామంది హీరోలు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇక మిగతా ఫ్యామిలీలో హీరోలు కూడా చాలానే రికార్డులు క్రియేట్ చేశారు.


 అయితే ఇలా ఇప్పటివరకు సీనియర్ హీరోలు ఇక వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన యువ హీరోలు ఎంతమంది ఉన్నప్పటికీ కేవలం నందమూరి ఫ్యామిలీకి మాత్రమే పరిమితమైన ఒక సెన్సేషన్ రికార్డ్ ఇప్పటివరకు ఎవరు బ్రేక్ చేయలేకపోయారు అని చెప్పాలి. అదేంటంటే.. ఇప్పుడు వరకు ఎంతో మంది హీరోలు ద్విపాత్రాభినయం చేయడం చూశాం. కానీ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ మాత్రం ఈతరం హీరోలలో ఏ హీరో చేయని విధంగా త్రిపాత్రాభినయం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ బాబీ దర్శకత్వంలో వచ్చిన జై లవకుశ సినిమాలో మూడు పాత్రల్లో నటించి ఇక నట విశ్వరూపం చూపించాడు అనడంలో డౌటే లేదు.

 ఇక ఇప్పుడు నందమూరి హీరో కళ్యాణ్ రామ్ సైతం అమీగోస్ సినిమాలో త్రిపాత్రభినయం చేయ బోతున్నాడు అని చెప్పాలి. ఇక గతంలో తాత ఎన్టీఆర్ సైతం దానవీరశూరకర్ణ సినిమా లో దుర్యోధనుడిగా, కృష్ణుడిగా, కర్ణుడిగా కూడా నటించి మూడు పాత్రలకు ప్రాణం పోసి అసమాన్యమైన నటన తో ప్రేక్షకులను మంత్రముగ్ధులని  చేశాడు. ఇక ఇలా ఒకే ఫ్యామిలీ నుంచి ముగ్గురు హీరోలు త్రిపాత్రాభినయం చేసిన సెన్సేషనల్ రికార్డు మాత్రం ఇప్పటివరకు ఏ హీరో కూడా బ్రేక్ చేయలేకపోయాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: