తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్ అనేది చాలా ఎక్కువగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇంతకు ముందు స్టార్ హీరోస్ బర్త్ డేస్.. లేదా ఏవైన ప్రత్యేక రోజులలో మాత్రమే ఈ సినిమాలను రీరిలీజ్ చేశారు.అయితే ఆ తర్వాత నెమ్మదిగా దర్శకుల పుట్టినరోజు వేడుకలకు కూడా పలు సినిమాలని మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇప్పుడు అలా కాకుండా సమయం దొరికితే అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమాలని కూడా మళ్లీ ప్రేక్షకుల ముందు విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే చెన్నకేశవ రెడ్డి, నువ్వే నువ్వే, జల్సా, ఖుషి, పోకిరి, వర్షం, బిల్లా ఇంకా బాద్ షా సినిమాలని విడుదల చేసి సక్సెస్ అయ్యారు. అలాగే కొన్ని ప్రేమకథలను కూడా మరోసారి విడుదల చేశారు. ఇక ఇప్పుడు ప్రేమికుల వారం నడుస్తోంది. ఈ సందర్భంగా మరో అందమైన ప్రేమకథను రీరిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఆ మూవీ మేకర్స్.తెలుగు చిత్రపరిశ్రమలో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ప్రేక్షకుల మనసులలో నిలిచిపోయిన అందమైన ప్రేమకథలలో నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా కూడా ఒకటి.


 ప్రభుదేవా దర్శకత్వంలో 2005 వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమాని ఎంఎస్ రాజు నిర్మించారు. సిద్ధార్థ్, త్రిష జంటగా నటించిన ఈ సినిమా అప్పుడు పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడమే కాకుండా..భారీగా వసూళ్లని కూడా రాబట్టింది. ప్రేమించిన అమ్మాయి కోసం ధనవంతుల కొడుకైన హీరో వ్యవసాయం చేసి ఆమె అన్నయ్యను ఎలా మెప్పించాడనేది ఈ చిత్ర కథాంశం.ఇక ఇప్పుడు ఈ ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన 4కె వెర్షన్ తో రీరిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇందులో లవ్ ట్రాక్, ఎమోషనల్ సీన్స్, శ్రీహరి, ప్రకాష్ రాజ్ ల క్యారెక్టర్స్, సునీల్, సంతోషి ఇంకా అలాగే నర్సింగ్ యాదవ్ కామెడీ బాగా అలరిస్తుంది. ఇంకా అలాగే ఈ చిత్రంలోని పాటలు కూడా పెద్ద సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇక ఈ రీరిలీజ్ ప్రమోషన్స్ కోసం హీరోహీరోయిన్, డైరెక్టర్ ను కూడా రంగంలోకి దింపబోతున్నారని సమాచారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: