టాలీవుడ్ టాప్ హీరోగా వరుస హిట్లతో దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా తన ఫ్రెండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ముచ్చటగా మూడో సారి చాలా సంవత్సరాల తరువాత మూవీ చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాతో ఖచ్చితంగా మరోసారి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అందుకునేందుకు సూపర్ స్టార్ మహేష్ బాబు రెడీ అవుతున్నాడు.ఇక ఈ సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ తనదైన మార్క్ కథతో భారీగా తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీని ఎప్పుడెప్పుడు చూద్దామా అని సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు కూడా ఎప్పటినుంచో ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.అయితే ఈ సినిమాను మొదట ఏప్రిల్ నెలలోనే రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించినా కూడా సినిమా షూటింగ్ అనేది ఇంకా సగం కూడా కాకపోవడంతో ఈ రిలీజ్‌ను దసరా పండుగకు వాయిదా వేశారు. 


ఇక దసరా నాటికి ఈ సినిమాను ఎలాగైనా సరే పూర్తి చేసి, పండగ కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా దసరా రిలీజ్ కూడా డౌటే అంటున్నారు. కానీ భయపడకండి. ఎందుకంటే ఈ సినిమా కాస్త ముందుగానే వస్తుంది. చిత్ర నిర్మాత అయిన నాగవంశీ ఈ సినిమా రిలీజ్ ఆగస్టులో ఉంటుందని తాజాగా వెల్లడించాడు.సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా విషయంలో ఫ్యాన్స్ ని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా  చిత్ర యూనిట్ ఈ సినిమాను ఆగస్టులో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోందట. ఇక ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోండగా, ఎస్ ఎస్ థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు.రొట్ట కొట్టుడు కొడుతున్నాడని మహేష్ ఫ్యాన్స్ ఇటీవల తమన్ కి సోషల్ మీడియాలో నరకం చూపించారు. ఇప్పుడు ఆ కసితో ఈ సినిమాకి ఓ రేంజిలో సంగీతం అందిస్తున్నాడని సమాచారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: