మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ ని మెప్పించే మాస్ ఎలిమెంట్స్ తో దర్శకుడు బాబీ వాల్తేరు వీరయ్యతో ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇక రవితేజ పాత్ర కూడా ఈ సినిమాకు చాలా బాగా ప్లస్ అయ్యింది. సెకండ్ హాఫ్ లో ఆయన ఎంట్రీ అయితే ప్రేక్షకులకు చాలా మంచి అనుభూతి పంచింది. శృతి గ్లామర్, దేవిశ్రీ సాంగ్స్ ఇలా అన్ని బాగా కుదరడం వల్ల ఈ సినిమా భారీ హిట్ పడింది. ఇక మెగాస్టార్ చిరంజీవి ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఆచార్య సినిమా చేదు అనుభవాలను వాల్తేరు వీరయ్య తో చెరిపేశారు. ఈ జోష్ లో భోళా శంకర్ చిత్ర షూటింగ్ ని కూడా పూర్తి చేస్తున్నారు. కాగా టాలీవుడ్ వర్గాల్లో ఓ షాకింగ్ రూమర్ ఇప్పుడు ఒక రేంజిలో వైరల్ అవుతూ చక్కర్లు కొడుతుంది. యాంకర్ శ్రీముఖితో మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో రొమాన్స్ చేయనున్నాడట.భోళా శంకర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓ ఐకానిక్ సీన్ స్పూఫ్ చేస్తారట. ఇక ఖుషి మూవీలో చిరుగాలికి భూమిక పైట పక్కకు జరుగగా పవన్ ఏమరపాటుగా ఆమె నడుము చూస్తారు.


సరిగ్గా అప్పుడే పవన్ ని చూసిన భూమిక అతన్ని అపార్థం చేసుకుంటుంది. అప్పట్లో థియేటర్స్ ని షేక్ చేసిన ఈ రొమాంటిక్ సీన్ ఇప్పుడు కూడా షేక్ చేస్తుంది. ఇక ఆ సీన్లో మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్నారట. యాంకర్ శ్రీముఖి భూమికగా ఇంకా చిరు పవన్ కళ్యాణ్ గా ఈ స్పూఫ్ సీన్ చేయనున్నారట. టాలీవుడ్ లో ఇది ఇప్పుడు బాగా వైరల్ అవుతూ పెద్ద హాట్ టాపిక్ గా మారింది.ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ అభిమానిగా చిరంజీవి కనిపిస్తారట. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రస్తుతం ప్రముఖంగా ప్రచారం అవుతుంది. ఇదే కనుక జరిగితే ఖచ్చితంగా థియేటర్స్ దద్దరిల్లడం ఖాయం.ఇక భోళా శంకర్ సినిమాకి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ చిత్రం వేదాళం అధికారిక రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. మిల్కీ బ్యూటీ తమన్నా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా కీర్తి సురేష్ కీలక పాత్ర పోషిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: