రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇటీవల గర్భం దాల్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఈ విషయాన్ని ఎంతో ఆనందంగా మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించాడు. దాదాపు వీరి పెళ్లి 10 సంవత్సరాలు గడుస్తుంది. ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ వీరిద్దరికి పిల్లలు లేకపోవడంతో మెగా కుటుంబంలో వారసుడు ఎప్పుడెప్పుడు వస్తాడా అని మెగా కుటుంబంతో పాటు మెగా అభిమానులు కూడా అదే తరాలు వెయిట్ చేస్తున్నారు. తన ప్రవర్తనతో మెగా ఫ్యామిలీకి మంచి పేరు తెచ్చిపెడుతోంది ఉపాసన. 

ఈ క్రమంలోనే తన కి సంబంధించిన పోస్టులను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది ఉపాసన. అయితే తాజాగా ఉపాసన తనపై వస్తున్న నెగిటివ్ కామెంట్ల గురించి స్పందించింది. చాలామంది గోల్డెన్ స్పూన్ తో పుట్టానని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని.. తన తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారని చెప్పుకొచ్చింది ఉపాసన. అంతేకాదు వృత్తిపరమైన బాధ్యతలతో నేను ఎప్పుడు బిజీ బిజీగా ఉంటాను అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు నా గురించి నెగిటివ్గా సోషల్ మీడియాలో ప్రచారాలు చేయవద్దని ఆమె కోరింది.అంతేకాదు నా పిల్లలకి సైతం నిరంతర వృద్ధిపరమైన బాధ్యతలతోనే నేను పెంచుతానని చెప్పుకొచ్చింది ఉపాసన.

 ప్రస్తుతం ఉపాసన చెప్పిన ఈ విషయాల్లో నిటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి అని చెప్పాలి .ఇప్పటివరకు ఉపాసన చాలా విషయాలలో ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది .అంతేకాదు ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి తన వంతు సహాయం చేస్తూనే ఉంటుంది ఉపాసన. ఈ క్రమంలోనే రామ్ చరణ్ జీవితంలో ఉపాసన వచ్చినందుకే రామ్ చరణ్ సక్సెస్ రేట్ కూడా పెరిగిందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమా ఎంతో భారీ బడ్జెట్ తో రూపొందుతోంది.కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు పాత్రల్లో కనిపించనున్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: