రష్మిక మందన ఈ పేరు తెలియని వారు ఉండరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ మధ్య మాత్రం రష్మిక మందన సినిమాల ద్వారానే కాకుండా ట్రోల్స్ కి గురవుతూ కూడా వైరల్ అవుతుంది అని చెప్పాలి. ఆమె మీద సోషల్ మీడియా ఫోకస్ ఎక్కువైంది.ఈ నేపథ్యంలోనే తను ఎక్కడికి వెళుతున్నా కూడా అక్కడ ఫోటోలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం రష్మిక మందన వరుస టూర్లకు వెళుతూ ఎంజాయ్ చేస్తుంది. అయితే ఈ క్రమంలోనే అందరూ రష్మిక మందన ఒంటరిగా వెళ్లడం లేదు అని విజయ దేవరకొండ తో పాటు వెళుతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. 

ఇలా వీరిద్దరూ కలిసి తిరగడంతో వీరిద్దరి మధ్య సీక్రెట్ గా ఏదో జరుగుతుంది అంటూ రకరకాల కథనాలు ప్రచారం అవుతున్నాయి. కాంతారా సినిమా విషయంలో కూడా రష్మిక మందన వివాదాస్పదం గా మారిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆ ఒక్క విషయంలోనే కాదు అప్పటినుండి ఎన్నో విషయాలలో వివాదాస్పదంగా మారుతుంది రష్మిక మందన.ఇక అప్పటినుండి సోషల్ మీడియాలో ఏదో ఒక వార్తలు నిలుస్తూనే ఉంది. తాజాగా ఇప్పుడు ఆమె డ్రెస్ విషయం సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.ఎన్నడూ లేని విధంగా ఈ మధ్య షూటింగ్స్ కు బ్రేక్ దొరికిన సమయంలో విహారయాత్రల కోసం విదేశాలకు వెళుతుంది రష్మిక మందన. ఇక అక్కడ అలసట నంతా తీర్చుకున్న తర్వాత

ఫుల్ గా ఫీల్ అవుతూ అక్కడి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉంది రష్మిక మందన. అంతేకాదు అక్కడ షాపింగ్ లో కూడా చేస్తుంది. అయితే తాజాగా తన సోషల్ మీడియాలో ఒక ఫోటోను షేర్ చేసింది రష్మిక మందన. ఇక ఆ ఫోటోలో చాలా కాస్ట్లీ డ్రెస్ తో కనిపించింది. ఇక ఆ ఫోటోలో వైట్ కలర్ టాప్ వేసుకొని లూయి స్ ఫ్యూటన్ కంపెనీకి చెందిన సమ్మర్ షార్ట్ డ్రెస్ క్రాఫ్ట్ కార్డియన్ అని పిలిచే ఈ టాప్ ఖరీదు అక్షరాల 2687 అని సమాచారం .ఒక్క టాప్ కోసమే రష్మిక దాదాపు రెండు లక్షలకు పైగా ఖర్చు చేయడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. సాధారణంగా ఏ సెలబ్రిటీస్ అయినా సరే కాస్ట్లీ వస్తువులు చెప్పులు డ్రెస్సులు కొనడం మామూలే..!

మరింత సమాచారం తెలుసుకోండి: