టాలీవుడ్ లో ఉన్న అగ్రదర్శకుల్లో మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఈయన సినిమాలను ఇష్టపడని వారు ఉండరు. ఇప్పటికే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోలతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు తీసిన ఈయన ప్రస్తుతం మహేష్ బాబుతో మూడో సినిమాని తెరకెక్కిస్తున్నాడు. దీనికంటే ముందు జూనియర్ ఎన్టీఆర్ తో అరవింద సమేత అనే సినిమాని తెరకెక్కించగా కమర్షియల్ గా ఈ సినిమా మంచి సక్సెస్ను అందుకుంది. ఇక ప్రస్తుతం మహేష్ తో సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. అయితే ఇప్పటి జనరేషన్ లో ఉన్న అగ్ర హీరోల్లో ప్రభాస్, రాంచరణ్ తో మాత్రం త్రివిక్రమ్ ఇప్పటివరకు సినిమాలను చేయలేదు. 

ఈ ఇద్దరు స్టార్ హీరోలతో త్రివిక్రమ్ సినిమాలు తీస్తే బాగుంటుందని ఫాన్స్ కూడా ఆసక్తి ఎదురు చూస్తున్నారు. అయితే సితార నిర్మాత నాగ వంశీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ డైరెక్షన్లో ప్రభాస్, రామ్చరణ్ లతో సినిమాలను ప్లాన్ చేస్తున్నామని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే త్రివిక్రమ్ కి రామ్ చరణ్ ప్రభాస్ నుండి గ్రీన్ సిగ్నల్ ఇంకా రావాల్సి ఉంది. ప్రస్తుతం డైరెక్టర్స్ లో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్నవారిలో త్రివిక్రమ్ ముందు వరుసలో ఉంటారు. ఇప్పటివరకు తనతో పని చేసిన స్టార్ హీరోలకు త్రివిక్రమ్ మంచి హిట్స్ ని అందించాడు. కాబట్టి కచ్చితంగా త్రివిక్రమ్ కి అటు ప్రభాస్ ఇటు రాంచరణ్ త్వరలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.

ఇద్దరు హీరోల్ల్లో ముందుగా రామ్ చరణ్ తోనే త్రివిక్రమ్ సినిమాను తెరకెక్కించే ఛాన్స్ ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ అలాగే బుచ్చిబాబు సినిమాలతో బిజీగా ఉన్నాడు. వీటి తర్వాతే త్రివిక్రమ్ తో చరణ్ మూవీ చేసే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ విషయానికొస్తే.. మహేష్ బాబుతో ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈస్సనం నిర్మిస్తుండగా.. ఎస్ ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఆగస్టు 11 నా ఈ సినిమాని విడుదల చేయాలని మేకర్ సన్నాహాలు చేస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: