పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో 'ప్రాజెక్ట్ కె' అనే భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి రోజుకో అప్డేట్ సినీ సర్కిల్స్ లో చెక్కర్లు కొడుతోంది. తాజాగా మరో అదిరిపోయే అప్డేట్ బయటికి వచ్చింది  ప్రాజెక్టు కే సినిమా నైజాం ఏరియా హక్కులు రికార్డ్ స్థాయిలో అమ్ముడుపోయాయి. ఇప్పటివరకు ఏ స్టార్ హీరో సినిమాకి ఇవ్వని భారీ మొత్తాన్ని ప్రభాస్ ప్రాజెక్ట్ కె సినిమాకి ఇచ్చి కొనుక్కున్నారట నైజాం డిస్ట్రిబ్యూటర్స్. ప్రాజెక్టుకె నైజాం హక్కులు ఏకంగా 70 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. ఈ రేంజ్ లో సినిమా రైట్స్ అమ్ముడు పోవడం అనేది నిజంగా ఒక రికార్డు అంటున్నారు బయ్యర్లు. 

దీంతో ప్రభాస్ నైజాం కింగ్ అంటూ సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతుంది. ఇక సైన్స్ ఫిక్షన్ కథాంశంతో నాగ అశ్విన్ ఈ సినిమాని రూపొందిస్తున్నాడు. సుమారు 500 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితమవుతోంది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత అశ్వినీ దత్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అంతేకాదు సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ సూపర్ హీరో తరహా పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా కోసం అన్నీ కూడా ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నారు మేకర్స్.

ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ బబిగ్ బి అమితాబచ్చన్ సైతం కీలక పాత్ర లో కనిపించనున్నాడు. తాజాగా ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా గెస్ట్ రోల్ చేస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వినిపించాయి. మొత్తంగా ప్రాజెక్టు కే భారీ బడ్జెట్ తో పాటు భారీ కాస్టింగ్ తో రూపుదిద్దుకుంటున్న తరుణంలో సినిమా విడుదలకు ముందే నైజా ఏరియా హక్కులు రికార్డ్ స్థాయిలో అమ్ముడవడం ఇప్పుడు ఫిలిం సర్కిల్స్లో హాట్ టాపిక్ గా మారుతుంది. ఇక ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని 2024 జనవరి 12న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారిక ప్రకటన చేసిన విషయం తెలిసిందే...!!

మరింత సమాచారం తెలుసుకోండి: