సాధారణంగా సినిమా హీరోలకు సోషల్ మీడియాలో కాస్త ఎక్కువ క్రేజీ ఉంటుంది. ఈ క్రమంలోనే వారికి సంబంధించిన విషయం ఏదైనా ఇంటర్నెట్ లోకి వచ్చిందంటే చాలు అది అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. అయితే ఇక సినీ సెలబ్రిటీల సినిమాలకు సంబంధించిన విషయాలను మాత్రమే కాదు పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి కూడా అభిమానులు ఎప్పుడు ఆసక్తి చూపుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇక ఏదో విషయం తెలుసుకోవడానికి సోషల్ మీడియాని అస్త్రంగా  మార్చుకొని అన్వేషణ ప్రారంభిస్తు ఉంటారు అని చెప్పాలి.


 ఇకపోతే ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్న జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ఒక వార్త కూడా ఇలాగే వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. టాలీవుడ్ లో పెద్దలు కుదుర్చున వివాహం చేసుకున్న కొద్ది మంది హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకరు అని చెప్పాలి. ప్రముఖ వ్యాపారవేత్త  స్టూడియో ఎన్ న్యూస్ ఛానల్ ఎండి నార్ని శ్రీనివాసరావు కుమార్తె లక్ష్మీ ప్రణతిని వివాహం చేసుకున్నారు ఎన్టీఆర్. చిన్నప్పటి నుంచి  హైదరాబాద్లోనే పుట్టి పెరిగిన ప్రణతి చివరికి తన అభిమాన హీరో అయిన ఎన్టీఆర్నే పెళ్లి చేసుకుంది అని చెప్పాలి. 2011లో వీరి వివాహం జరిగింది.


 ఇక ఇప్పుడు ఇద్దరూ కూడా టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా కొనసాగుతూ ఉన్నారు. అయితే ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి పెళ్లి సమయంలో అత్తింటి కి భారీగానే కట్న కానుకలు తీసుకువచ్చిందట. వేలకోట్లకు అధిపతి అయినా నార్ని శ్రీనివాసరావు తన అల్లుడు ఎన్టీఆర్ కు 250 కోట్ల రూపాయలు కట్నం గా ఇచ్చాడట. అంతేకాదు ఇక లక్ష్మీ ప్రణతి పేరిట 1000 కోట్లకు పైకి అనే ఆస్తులు రాసిచ్చారట. ఇలా ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతిని వివాహం చేసుకున్న సమయంలో భారీగానే కట్న కానుకలు అందుకున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే ఎన్టీఆర్ కెరియర్ విషయానికి వస్తే త్రిబుల్ ఆర్ సినిమాతో హిట్ కొట్టిన ఎన్టీఆర్ ఇక ఇప్పుడు కొరటాల శివతో సినిమాకు సిద్ధమవుతూ ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: