శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా అదితి రావు హైదరి హీరోయిన్గా నటించిన చిత్ర మహాసముద్రం. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పెద్దగా హిట్ టాక్ ను సొంతం చేసుకోలేకపోయింది. దీంతో నిర్మాతలకు నష్టాలను మిగిల్చింది.. ఇక తర్వాత కాలంలో ఈ సినిమా గురించి అందరూ మర్చిపోయారు. కానీ అంతలోనే ఈ సినిమా మరోసారి తెర మీదికి వచ్చింది. అయితే ఈ సినిమా తెరమీదకి రావడానికి కారణం.. ఈ మూవీలో నటించిన సిద్ధార్థ్, అదితి  రావు హైదరి చట్టాపట్టాలేసుకొని  తిరిగి రిలేషన్ లో కొనసాగడమే.


 సాధారణంగానే సినీ సెలబ్రిటీలు ఒక్కచోట కనిపించారు అంటే వారు ప్రేమలో ఉన్నారని వార్తలు వస్తాయి. ఇక సిద్ధార్థ్, అదితి పై కూడా అలాగే వార్తలు వచ్చాయి. అందరిలాగానే వీరి రిలేషన్షిప్ పై వీరు కూడా ఎక్కడ క్లారిటీ ఇవ్వలేదు. దీంతో సోషల్ మీడియాలో వార్తలు మరింత జోరు అందుకున్నాయి.  ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ ఇద్దరు కలిసి ప్రత్యక్షమవుతూ ఉన్నారు. కెరియర్ పరంగా ఎవరి సినిమాల్లో వారు బిజీ బిజీ గానే ఉన్నారు అని చెప్పాలి. అయితే మొదటిసారి అదితి రావు హైదరి సిద్ధార్థ తో ఉన్న ప్రేమ గురించి స్పందించింది.


 అందరినీ మరింత కన్ఫ్యూషన్ లో పడేసింది. ప్రస్తుతం హిందీలో మూడు వెబ్ సిరీస్ లలో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే తాజ్ వెబ్ సిరీస్ మార్చ్ 3వ తేదీన విడుదల కానుంది. కాగా ప్రమోషన్స్ లో భాగంగా సిద్ధార్థ తో ఉన్న ప్రేమ గురించి వస్తున్న రూమర్స్ గురించి రిపోర్టర్లు ప్రశ్నించారు. దీనిపై స్పందించిన అదితి.. జనాలు వాళ్ళకి ఏది కావాలి అనుకుంటారో దాని గురించి మాట్లాడతారు. వారిని మనం ఆపలేం కదా. కాబట్టి నాకు ఏది కావాలో నేను దాన్నే వెతుక్కుంటూ వెళ్తాను. నా వరకు అంతా ఓకేగా ఉంది. చూసే ఆడియన్స్ నన్ను ఇంతవరకు ఆదరిస్తారో అప్పటివరకు నటిస్తూనే ఉంటానంటూ చెప్పుకోవచ్చింది. ఇక ఈ మాటలు విన్న తర్వాత  సిద్ధార్థ్ తో ప్రేమను కన్ఫార్మ్ చేసిందా... లేకపోతే అదంతా వేస్ట్ లైట్ తీసుకోండి అని చెప్పిందా అర్థం కాక కన్ఫ్యూజన్లో పడిపోయారూ అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: