ప్రస్తుతం చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా గడుపుతున్న పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ను ఇప్పుడు మరో యంగ్ డైరెక్టర్ లైన్లో పెట్టినట్లు ఫిలిం సర్కిల్స్ ఓ వార్త వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు అనే పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గత ఏడాది నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తో 'బింబిసార' అనే సినిమాతో వెండితెరకు దర్శకుడిగా ఆరంగేట్రం చేశాడు వశిష్ట. మొదటి సినిమాతోనే దర్శకుడిగా సంచలన విజయం అందుకున్నాడు. ఇక ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఓ బడా స్టార్ హీరో తో చేయాలని ఫిక్స్ అయిపోయాడట. దీంతో ఏకంగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ పైనే ఈ దర్శకుడు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. 

లేటెస్ట్ ఫిలింనగర్ టాక్ ప్రకారం ఈమధ్య దర్శకుడు వశిష్ట ప్రభాస్ కి ఓ మంచి కథను వినిపించారని తెలుస్తోంది. ఇక కథ చాలా ఫ్రెష్ గా ఉందట. ఆ కథ మన డార్లింగ్ ప్రభాస్ కి తెగ వచ్చేసిందట. దాంతో వశిష్టతతో సినిమా చేయడానికి ప్రభాస్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ఇక త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వెలువడనుంది. అయితే ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉండడం వల్ల అవన్నీ పూర్తయ్యాకే వశిష్ట డైరెక్షన్లో ప్రభాస్ సినిమా చేసే అవకాశం ఉంది. అటు వశిష్ట కూడా కళ్యాణ్ రామ్ తో బింబిసారా పార్ట్ 2 చేయాల్సి ఉంది. ప్రస్తుతం బింబిసారా తర్వాత కళ్యాణ్ రామ్ చేయాల్సిన సినిమాల షూటింగ్స్ ఇప్పటికే పూర్తయ్యాయి.

దాంతో వశిష్ట ముందు కళ్యాణ్ రామ్ తో బిబిసార పార్ట్ 2 తెరకెక్కించిన తర్వాతే ప్రభాస్ సినిమాని పట్టాలకించే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ కుర్ర డైరెక్టర్ ప్రభాస్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని సినిమాను తెరకెక్కిస్తాడా? లేదా  డార్లింగ్ ఇమేజ్ ని పక్కన పెట్టి తనదైన ప్రయోగం చేస్తాడా? అనేది చూడాలి. ఇక ప్రస్తుతం ప్రభాస్ సలార్, ప్రాజెక్టు కే, మారుతి సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఆది పురుష్ విడుదలకు సిద్ధమవుతోంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావుత్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీ జూన్ 16న  ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.ఇక ఆ తర్వాత సలార్ సెప్టెంబర్ 28న, అలాగే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రాజెక్టుకే సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: