టాలీవుడ్ లో ప్రముఖ నటుడు, డైరెక్టర్ పోసాని కృష్ణ మురళి తాజాగా కరోనా బారిన పడ్డట్టుగా తెలుస్తోంది. తనతో పాటు తన కుటుంబ సభ్యులకు కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా తెలియజేశారు. ప్రస్తుతం పోసాని గచ్చిబౌలిలో AMG ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. తనకు సినిమా అవకాశాలు ఇచ్చిన దర్శక నిర్మాతలను హీరోలను మన్నించమంటూ కోరుకుంటూ తన వల్ల సినిమా షూటింగ్స్ ఆగిపోవడం చాలా బాధగా ఉందంటూ పోసాని తెలియజేసినట్లు సమాచారం. ముఖ్యంగా రెండు పెద్ద సినిమాల షూటింగ్ వాయిదా పడే అవకాశం ఉన్నట్లుగా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.


తనకి కరోనా వచ్చిన విషయం తెలిసి నిర్మాతలకు సైతం విజ్ఞప్తి చేస్తున్నాను అంటూ తెలియజేస్తున్నారు పోసాని.. ప్రేక్షకులు , సినీ పరిశ్రమ ఆశీస్సులతో దేవుడి దయవల్ల త్వరగా కోలుకొని మళ్ళీ షూటింగ్లో పాల్గొంటాను అంటూ ఓసారి కృష్ణ మురళి ఒక ప్రకటన ద్వారా తెలియజేసినట్లు తెలుస్తోంది. దీంతో అభిమానులు పలువురు నేతలు, పోసాని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. గత కొంతకాలంగా కరోనా కేసులు ఈ మధ్యకాలంలో మరింత ఎక్కువగా వినిపిస్తున్నాయి దీంతో ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు



గడిచిన కొద్ది రోజుల క్రితం సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కూడా కరోనా బారిన పడ్డట్టు తెలియజేయడం జరిగింది. అయితే కరోనా నుంచి పూర్తిగా కోరుకున్న కీరవాణి విషయం మరువకముందే ఇప్పుడు నటుడు పోసాని కూడా కరోనా బారిన పడటంతో సినీ పరిశ్రమ మళ్లీ భయభ్రాంతులకు గురయ్యే విధంగా కనిపిస్తోంది. ప్రతి ఒక్కరు కూడా తప్పక మాస్కులు ధరించాలని డిస్టెన్స్ ను కూడా మైంటైన్ చేయాలని తెలియజేస్తూ ఉన్నారు.


ఇక ప్రభుత్వాలు కూడా కరోనా గురించి పలు రకాలుగా తెలియజేస్తూ ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉన్నారు .అయినప్పటికీ కూడా కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా భౌతిక దూరాన్ని పాటిస్తూ క్రమం తప్పకుండా మాస్కులు ధరించడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: